News November 3, 2024
భారత్ ఓటమి.. సిరీస్ క్లీన్స్వీప్ చేసిన NZ

న్యూజిలాండ్తో మూడో టెస్టులోనూ భారత జట్టు ఘోరంగా ఓడింది. దీంతో 3 టెస్టుల సిరీస్ను 3-0తో కివీస్ క్లీన్స్వీప్ చేసింది. గెలుస్తారనుకున్న చివరి టెస్టులోనూ రోహిత్ సేన 25 రన్స్ తేడాతో ఓడింది. 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 121కే ఆలౌట్ అయింది. పంత్(64) ఒంటరి పోరాటం చేసినా తన జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయారు. భారత్ చివరిసారి 2000లో SA చేతిలో 2-0తో క్లీన్స్వీప్కు గురైంది.
Similar News
News February 10, 2026
పాక్ యూటర్న్ విలువ ₹1,500 కోట్లు!

భారత్తో మ్యాచ్ బాయ్కాట్పై పాక్ యూటర్న్ తీసుకోవడంతో ICC సహా గ్లోబల్ బ్రాడ్కాస్టర్లకు దాదాపు ₹1,500 కోట్ల ఆదాయం మిగిలింది. మ్యాచ్ రద్దయి ఉంటే మీడియా పార్ట్నర్ అయిన జియోహాట్స్టార్కు ICC భారీ పరిహారం ఇవ్వాల్సి వచ్చేది. అలాగే 10 సెకన్ల యాడ్కు ₹25-40 లక్షల చొప్పున సుమారు ₹200-300 కోట్ల యాడ్ రెవెన్యూ పోయేది. స్పాన్సర్షిప్లు, డిజిటల్ ట్రాఫిక్, హోటల్ బుకింగ్ల రూపంలో మరింత లాస్ తప్పేది కాదు.
News February 10, 2026
తాబేలు ఉన్న ఉంగరాన్ని ధరిస్తే..?

జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆర్థిక కష్టాలు తొలగి, లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి తాబేలు ఉంగరం ధరించడం మంచిదని పండితులు చెబుతున్నారు. ‘ఈ ఉంగరాన్ని ముందుగా పాలు, గంగాజలంతో శుద్ధి చేయాలి. ముందుగా లక్ష్మీదేవి పాదాల చెంత ఉంచి పూజించాలి. గురువారం ఈ ప్రక్రియ పూర్తి చేసి, శుక్రవారం నాడు కుడిచేతి చూపుడు/మధ్య వేలుకు ధరించాలి. ఉంగరం పెట్టుకున్నప్పుడు తాబేలు ముఖం మీ వైపు ఉండేలా చూసుకోవాలి’ అని సూచిస్తున్నారు.
News February 10, 2026
216 గంటల భరతనాట్యంతో ప్రపంచ రికార్డు

కర్ణాటకలోని ఉడిపికి చెందిన 23 ఏళ్ల విదుషి దీక్ష భరతనాట్యం చేసి ప్రపంచ రికార్డును సృష్టించారు. 216 గంటల పాటు నిరంతరాయంగా భరతనాట్యం ప్రదర్శించి, తన 170 గంటల పాత రికార్డును బద్దలు కొట్టి, గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకున్నారు. డాక్టర్ జి. శంకర్ మహిళా కళాశాల ఆడిటోరియంలో జరిగిన ఈ ప్రదర్శన సమయంలో ప్రతి మూడు గంటలకు కేవలం 15 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటూ ఆమె ఘనతను సాధించారు.


