News November 3, 2024

కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రాణించలేకపోయా: రోహిత్

image

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో కెప్టెన్‌గానూ, బ్యాటర్‌గానూ తాను అత్యుత్తమ ప్రదర్శన చేయలేకపోయానని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. ఈ సిరీస్ ఓటమి తనను బాధిస్తుందని చెప్పారు. జట్టుగానూ సరైన ప్రదర్శన చేయలేకపోయామని, పరాజయాలకు ఇదే కారణమని పేర్కొన్నారు. తొలి ఇన్నింగ్సులో మరో 30 పరుగులు చేయాల్సి ఉందన్నారు. అయితే NZ తమకంటే మెరుగ్గా ఆడిందని, ఓటమిని స్వీకరిస్తున్నామని తెలిపారు.

Similar News

News April 1, 2026

ముగిసిన నీలం సాహ్ని పదవీకాలం

image

AP: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఐదేళ్ల పదవీకాలం నిన్నటితో ముగిసింది. ఆమె స్థానంలో రిటైర్డ్ సీఎస్ నీరబ్ కుమార్‌, తదితరుల పేర్లు వినిపించినా నియామకం జరగలేదు. సాధారణ ఎన్నికలతో పాటు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలోనూ కొత్తగా రాబోయే SEC పాల్గొనాల్సి ఉంటుంది. అందుకే మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న అధికారి కోసం ప్రభుత్వం అన్వేషిస్తున్నట్లు సమాచారం. 45రోజుల్లో కమిషనర్‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది.

News April 1, 2026

‘ఏఐ సెక్సువల్’.. ఇప్పుడు కొత్త ట్రెండ్!

image

ఆహారపు అలవాట్లు, ఇష్టాలే కాదు బంధాల్లోనూ కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది. అదే ‘ఏఐ సెక్సువల్’. లైంగిక విషయాల గురించి ఏఐతో పంచుకునే వాళ్లు వాళ్లను ‘ఏఐ సెక్సువల్’గా పేర్కొంటున్నారు. JoiAI అనే ప్లాట్‌ఫామ్ సర్వేలో 43% మంది లైంగిక సమస్యలపై, 37% మంది ఫ్లర్టింగ్/డేటింగ్‌పై, 33% సెక్స్ చాట్‌కు AIని వినియోగిస్తున్నట్లు తేలింది. గోప్యత, ఫ్రీగా మాట్లాడొచ్చనే ఏఐపై ఆధారపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు.

News April 1, 2026

‘పోలవరం’ అకౌంట్లోకి డబ్బులు

image

AP: పోలవరం ప్రాజెక్టుకు రూ.1,301.61కోట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ కుల్దీప్ కుమార్‌ సింగ్ రాష్ట్రానికి లేఖ రాశారు. ఆ డబ్బులు ప్రాజెక్ట్ అకౌంట్లో నేరుగా జమవుతాయని జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. డ్యామ్ పనులు, నిర్వాసితుల పరిహారం కోసం రూ.1,508కోట్లు మంజూరు చేయాలని ఇటీవల రాష్ట్ర జలవనరులశాఖ కేంద్రాన్ని కోరింది. సమీక్షించి తాజాగా నిధులు రిలీజ్ చేసింది.