News November 3, 2024
ఆఫీసులో పనిచేస్తేనే మానసిక ఆరోగ్యం: సర్వే

వర్క్ఫ్రం హోం కంటే ఆఫీసులకు వెళ్లి పని చేస్తున్న భారతీయులు మెరుగైన మానసిక ఆరోగ్యాన్ని అనుభూతి చెందుతున్నట్టు సేపియన్స్ ల్యాబ్స్ అనే సంస్థ చేసిన అధ్యయనంలో తేలింది. ఈ సంస్థ 65 దేశాల్లోని 54,000 మంది ఉద్యోగులపై సర్వే చేసింది. మెరుగైన మానసిక ఆరోగ్యానికి ఆఫీసుల్లో పాజిటివ్ రిలేషన్స్ ఓ కారణమని తెలిపింది. ప్రతికూల బంధాలు, వృత్తిపై ఆసక్తిలేకపోవడం నిస్సహాయతకు గురిచేస్తాయని పేర్కొంది.
Similar News
News September 18, 2025
3 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్

AP: ఈ నెల 26 నుంచి 28 వరకు 3 రోజుల పాటు బాపట్ల జిల్లాలోని సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ జరగనుంది. ఇందులో భాగంగా సాహస క్రీడలు, ఎగ్జిబిషన్, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ నెల 27న సీఎం చంద్రబాబు బీచ్ను సందర్శించి, రూ.97 కోట్ల అభివృద్ధి పనులుకు శంకుస్థాపన చేస్తారని ప్రభుత్వం తెలిపింది. బాపట్ల పట్టణం నుంచి సూర్యలంక బీచ్ 9 కి.మీ దూరం ఉంటుంది.
News September 18, 2025
శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.
News September 18, 2025
ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<