News November 4, 2024
కూతురు పుట్టిందన్న ఆనందం.. అంతలోనే విషాదం.!

సత్తెనపల్లిలో ఆదివారం రాత్రి వెన్నాదేవి సమీపంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల కథనం మేరకు యడ్లపాడు మండలం లింగారావుపాలెంకు చెందిన రోశయ్య(32)కు వివాహం అయిన నాలుగేళ్లకు కుమార్తె పుట్టింది. ఆనందంతో తన బంధువైన వీరేంద్రతో కలిసి కుమార్తెను చూసి వస్తుండగా గుంటూరు-పిడుగురాళ్ల మధ్యమార్గంలో వారు వెళ్తున్న బైక్ను బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
Similar News
News March 16, 2026
GNT: రోడ్డు ప్రమాదంలో ప్రొఫెసర్ మృతి

విజయవాడ బైపాస్లో ఘోర ప్రమాదం జరిగింది. గుంటూరుకు చెందిన ప్రదీప్ రాజ్ (41) ఏలూరులో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. పెనుగంచిప్రోలు నుంచి ఏలూరు వెళ్తుండగా పిల్లలకు టిఫిన్ తినిపించేందుకు కారు ఆపారు. తిరిగి బయలుదేరుతున్న క్రమంలో గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కళ్ల ముందే తండ్రి మరణించడంతో చిన్నారుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 16, 2026
GNT: మిద్దెతోట సాగుదారులకు ఈ నెల 21న పురస్కారాలు

ప్రకృతిపై ప్రేమతో మిద్దెతోటలను పెంచుతున్న వారికి పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది. వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడులో రైతునేస్తం ఫౌండేషన్ ఈ నెల 21న పురస్కారాలు ప్రదానం చేయనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన 30 మంది మిద్దెతోట పెంపకందారులను ఎంపిక చేశారు. వారికి పురస్కారాలు అందించనున్నట్లు రైతు నేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ వై. వెంకటేశ్వరరావు తెలిపారు.
News March 16, 2026
GNT:”ఎస్పీ ఆఫీస్ లో పీజీఆర్ఎస్ రద్దు”

గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం రద్దైంది.
పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చే ప్రజలు విషయాన్ని గమనించి ఎస్పీ కార్యాలయానికి వచ్చే కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని SP వకుల్ జిందాల్ సూచించారు. తదుపరి జరిగే పీజీఆర్ఎస్ వివరాలను ముందు రోజు వెళ్లడిస్తామని చెప్పారు.


