News November 4, 2024
ఇరిగేషన్ను పట్టించుకోని జగన్: మంత్రి నిమ్మల

AP: రాయలసీమ బిడ్డ అని చెప్పుకునే జగన్ ఇక్కడ సాగునీటి రంగాన్ని పట్టించుకోలేదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. అగ్రికల్చర్, హార్టికల్చర్, డ్రిప్ ఇరిగేషన్ను గాలికొదిలేశారని దుయ్యబట్టారు. కర్నూలు ఉల్లి మార్కెట్ను తనిఖీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. గతేడాది OCTలో మార్కెట్కు 52వేల టన్నుల ఉల్లి వస్తే ప్రస్తుతం 2.5 లక్షల టన్నులు వచ్చిందన్నారు. ఈసారి రైతులు అధిక ధరను పొందారని చెప్పారు.
Similar News
News September 18, 2025
ఈసీఐఎల్లో 160 ఉద్యోగాలు

హైదరాబాద్లోని <
News September 18, 2025
నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

APలోని రాయలసీమలో ఒకటి, రెండుచోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA హెచ్చరించింది. కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, GNT, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అటు TGలోని HYDలో సాయంత్రం మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD పేర్కొంది.
News September 18, 2025
‘OG’ టికెట్ ధరల పెంపు.. YCP శ్రేణుల ఫైర్

పవన్ కళ్యాణ్ OG సినిమా <<17742687>>టికెట్<<>> రేట్లను పెంచడంపై వైసీపీ శ్రేణులు ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. బెనెఫిట్ షోకు ఏకంగా రూ.1,000 (జీఎస్టీ కలుపుకుని) ఏంటని ప్రశ్నిస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ తన సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అయితే పుష్ప-2 సినిమా టికెట్ ధరలను సైతం (రూ.800+GST) పెంచిన విషయం గుర్తు లేదా అని పవన్ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. దీనిపై మీ కామెంట్?