News November 4, 2024
హత్య కేసును చేధించిన సదాశివనగర్ పోలీసులు

సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామ శివారులో అక్టోబర్ 31న జరిగిన హత్య కేసును చేధించినట్లు ఎల్లారెడ్డి డీఎస్పి శ్రీనివాసులు తెలిపారు. సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో హత్య కేసు వివరాలను వెల్లడించారు. గంగాధర్ అనే వ్యక్తి కృష్ణ అనే వ్యక్తిని హత్య చేసినట్లు ఒప్పుకోవడం జరిగిందన్నారు. కృష్ణ వద్ద నుంచి గంగాధర్ అనే వ్యక్తి తీసుకున్న అప్పును ఇవ్వొద్దనే దురుద్దేశంతో హత్య చేసినట్లు ఒప్పుకున్నారని స్పష్టం చేశారు.
Similar News
News January 11, 2026
నిజామాబాద్ జిల్లా పద్మశాలి కాలమానిని ఆవిష్కరణ

పద్మశాలి భవనంలో పద్మశాలి ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ సభ్యుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాలమానిని – 2026ను సంఘం ప్రతినిధులు ఆవిష్కరించారు. అసోసియేషన్ అధ్యక్షుడు చౌకే వరప్రసాద్ మాట్లాడుతూ.. ఉద్యోగుల ఐక్యతకు, సంక్షేమానికి సంఘం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఆసమ్ నవీన్, కోశాధికారి బాస దేవిదాస్, భూమేశ్వర్, రుద్ర గణపతి, భోజదాస్ పాల్గొన్నారు.
News January 11, 2026
ఆర్మూర్: దంపతుల ఆత్మహత్యాయత్నం

ఆర్మూర్ శివారులో శనివారం సాయంత్రం దంపతులు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. వేల్పూర్ మండలం పడిగేలా గ్రామం వడ్డెర కాలనికి చెందిన రవితేజ, భార్య శోభ పట్టణ శివారులోని ఓ వెంచర్లో విషం తాగి ఆపస్మారక స్థితిలోకి వెళ్లారు. గమనించిన స్థానికులు పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులు వారిని చికిత్స కోసం జిల్లా కేంద్రానికి తరలించారు.
News January 11, 2026
NZBకు TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రాక

TPCC చీఫ్, MLC మహేశ్ కుమార్ గౌడ్ ఆదివారం నిజామాబాద్ వస్తున్నారు. ఉదయం 8 గంటలకు HYD నార్సింగి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11.30కు NZB చేరుకుంటారు. 12 గంటలకు స్థానికంగా నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొని మధ్యాహ్నం 3 గంటలకు R&B గెస్ట్ హౌస్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. రాత్రి నిజామాబాద్లో బస చేసి సోమవారం ఉదయం 11 గంటలకు వరంగల్ బయలుదేరి వెళ్తారు.


