News November 4, 2024
ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 3 శాతానికి పెంపు

AP: ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3 శాతానికి పెంచుతూ GOVT నిర్ణయం తీసుకుంది. స్పోర్ట్స్ ఫర్ ఆల్ పేరుతో తీసుకొచ్చిన నూతన క్రీడా పాలసీకి CM చంద్రబాబు ఆమోదం తెలిపారు. APని క్రీడా కేంద్రంగా మార్చే లక్ష్యంతో పాలసీకి రూపకల్పన చేశారు. ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్ విజేతలకు ప్రోత్సాహకం రూ.75 లక్షల నుంచి రూ.7 కోట్లకు పెంచారు. అలాగే స్టేడియాలు, క్రీడా ప్రాంగణాల అభివృద్ధిపైనా చర్చించారు.
Similar News
News February 20, 2026
టెన్త్ స్టూడెంట్ల పేర్లలో తప్పుల సవరణకు ఛాన్స్

AP: టెన్త్ విద్యార్థుల పేర్లు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, జెండర్ వివరాల్లో తప్పులుంటే స్కూళ్ల ఐడీల ద్వారా HMలు ఈనెల 21లోపు సరిచేయాలని బోర్డు సూచించింది. బోర్డు అందించే లింకుల్లో వీటిని సమర్పించాలంది. కరెక్షన్స్ను విద్యార్థులు, పేరెంట్స్ కూడా సరిచూసుకోవాలని పేర్కొంది. ఈ పరీక్షలకు 6 లక్షల మంది హాజరుకానున్నారు.
News February 20, 2026
ఆస్తి పంపకాలలో వాస్తు సూచనలు

కుటుంబంలో ఆస్తి పంపకాలప్పుడు మనస్పర్థలు రాకుండా ఉండేందుకు వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు కొన్ని సూచనలు చేశారు. అవి.. ఖాళీ స్థలాల విభజనలో తూర్పు, ఉత్తరం దిశల్లో చిన్నవారు ఉండాలి. పడమర, దక్షిణం దిశల్లో పెద్దవారు ఉండాలి. ఈ పద్ధతిని అనుసరిస్తే సోదరుల మధ్య ఐక్యత దెబ్బతినదు. ఇలా శాస్త్రోక్తంగా దిశలు కేటాయిస్తే అనవసర తగాదాల తగ్గుతాయి. ఇలా కుటుంబంలో ప్రశాంతతను, ఆర్థికాభివృద్ధిని పెంపొందించుకోవచ్చు. <<-se>>#Vasthu<<>>
News February 20, 2026
‘ఒకే గ్రూప్లో టాప్ టీమ్సా?’.. ప్రీసీడింగ్పై ఫ్యాన్స్ అసంతృప్తి

టీ20 ప్రపంచకప్లోని ప్రీసీడింగ్ పద్ధతిపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టేబుల్ టాపర్స్గా నిలిచిన ఇండియా, జింబాబ్వే, విండీస్, సౌతాఫ్రికా ఓకే గ్రూప్లో ఉండటం సరికాదంటున్నారు. కాగా మ్యాచ్ నిర్వహణ ఏర్పాట్లు, టికెట్ల అందుబాటులో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రీసీడింగ్ పద్ధతిని 2024లో ICC తీసుకొచ్చింది. క్వాలిఫైడ్ జట్లకు గ్రూప్ స్టేజ్లో, సూపర్-8లో నిర్ణీత స్లాట్లను ICC కేటాయిస్తోంది.


