News November 4, 2024
రేపు ఉమ్మడి ప్రకాశం జిల్లా YCP సమీక్షా సమావేశాలు

ప్రకాశం జిల్లా రీజనల్ కో- ఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి రేపు ఉదయం మంగళవారం 10:00 గంటలకు ఒంగోలు పార్టీ ఆఫీస్లో ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. మండల పార్టీ అధ్యక్షుడు, MPPలు, ZPTCలు, మున్సిపల్ ఛైర్మన్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.
Similar News
News January 13, 2026
త్రిపురాంతకం హైవేపై రోడ్డు ప్రమాదం.!

త్రిపురాంతకం మండలంలోని ముడివేముల సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూరగాయల లోడుతో వెళ్తున్న ఆటో- బొలెరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కూరగాయల ఆటోలో ఉన్న పలువురికి గాయాలు కాగా.. క్షతగాత్రులను హైవే అంబులెన్స్ సహాయంతో వినుకొండకు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 13, 2026
మరోసారి తెరపైకి ప్రకాశం జిల్లా ఎయిర్పోర్ట్

కొత్తపట్నం మండలం ఆలూరు గ్రామ పరిధిలో విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదించిన భూములను కలెక్టర్ రాజబాబు సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఎయిర్ పోర్టు అథారిటీ నుంచి వచ్చిన టెక్నికల్ టీం సభ్యులు ఆయుషి రాయ్తో కలిసి కలెక్టర్ భూముల వివరాలను సంబంధిత మ్యాపుల ద్వారా పరిశీలించారు. అనంతరం పలు అంశాలపై ఎయిర్ పోర్టు అథారిటీ అధికారులతో కలెక్టర్ మాట్లాడారు.
News January 13, 2026
విమానాశ్రయం భూములను పరిశీలించిన ప్రకాశం కలెక్టర్

కొత్తపట్నం మండలం ఆలూరు గ్రామ పరిధిలో విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదించిన భూములను కలెక్టర్ రాజబాబు సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఎయిర్ పోర్టు అథారిటీ నుంచి వచ్చిన టెక్నికల్ టీం సభ్యులు ఆయుషి రాయ్తో కలిసి కలెక్టర్ భూముల వివరాలను సంబంధిత మ్యాపుల ద్వారా పరిశీలించారు. అనంతరం పలు అంశాలపై ఎయిర్ పోర్టు అథారిటీ అధికారులతో కలెక్టర్ మాట్లాడారు.


