News November 5, 2024
బాలికపై అత్యాచారం అంటూ వార్తలు.. స్పందించిన పోలీసులు

AP: తిరుపతి జిల్లా యర్రావారిపాలెంలో ఓ బాలికపై అత్యాచారం జరిగిందన్న ప్రచారంపై పోలీసులు స్పందించారు. ఫిర్యాదుపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని తెలిపారు. విచారణ పూర్తికాక ముందే కొంతమంది సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. కాగా ఈ ఘటనపై వైసీపీ మండిపడింది. ‘ఇంకెంత మంది ఆడబిడ్డలు మీ రెడ్ బుక్ రాజ్యాంగానికి బలవ్వాలి చంద్రబాబు, అనిత, పవన్ కళ్యాణ్, లోకేశ్?’ అని ట్వీట్ చేసింది.
Similar News
News November 11, 2025
ఇంజినీర్ పోస్టులకు RITES నోటిఫికేషన్

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్( <
News November 11, 2025
రూ.4 కోట్ల కారు కొన్న అర్ష్దీప్ సింగ్

టీమ్ ఇండియా స్టార్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. మెర్సిడెస్ AMG G63 వ్యాగన్ మోడల్తో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ కారు 585 HP పవర్, 850 NM టార్క్తో 0-100 కి.మీ వేగాన్ని 4.3 సెకన్లలోనే అందుకుంటుంది. ధర దాదాపు రూ.4 కోట్లు.
News November 11, 2025
ఇంటి బేస్మెంట్ రోడ్డు కంటే ఎంత ఎత్తు ఉండాలి?

ఇంటి బేస్మెంట్ ఎత్తు గురించి వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు ముఖ్యమైన సలహాలిచ్చారు. ‘ఇంటి బేస్మెంట్ తప్పనిసరిగా రహదారి ఎత్తు కంటే కనీసం 3 ఫీట్ ఎత్తులో ఉండాలి. లేకపోతే వర్షాకాలంలో నీరు ఇంట్లోకి వస్తుంది. రహదారి నుంచి వచ్చే ప్రతికూల శక్తులు, కాలుష్యం నేరుగా ఇంట్లోకి రాకుండా నిరోధించడానికి ఈ నియమం పాటించాలి. ఇంటికి ఆధారం, గౌరవం పెరగడానికి, లోపల శుద్ధి ఉండడానికి ఈ ఎత్తు ఉత్తమం’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>


