News November 5, 2024

కళ్యాణం.. ఇండియన్ ఎకానమీకి వైభోగం

image

ఈ దీపావళి పెళ్లిళ్ల సీజన్ భారత ఎకానమీకి భారీ స్థాయిలో కాంట్రిబ్యూట్ చేయబోతోంది. ఈ నెల రోజుల్లోనే దేశవ్యాప్తంగా 48 లక్షల వివాహాలు జరుగుతాయని CAIT తెలిపింది. దీంతో రూ.6లక్షల కోట్ల బిజినెస్ జనరేట్ అవుతుందని అంచనా వేసింది. ఢిల్లీలోనే 4.5 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని, దాంతో రూ.1.5లక్షల కోట్ల వ్యాపారం నమోదవుతుందని పేర్కొంది. గతేడాది ఇదే సీజన్లో 38 లక్షల పెళ్లిళ్లతో రూ.4.2 లక్షల కోట్ల బిజినెస్ జరిగింది.

Similar News

News January 9, 2026

భూరికార్డులను ఎవరూ మార్చలేరు: చంద్రబాబు

image

AP: పాస్‌బుక్స్ పంపిణీ పవిత్రమైన కార్యక్రమమని CM చంద్రబాబు తెలిపారు. తూ.గో.జిల్లా రాయవరంలో ఆయన పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ప్రాణం పోయినా రైతు భూమి కోల్పోయేందుకు అంగీకరించడు. సున్నితమైన అంశంతో పెట్టుకోవద్దని మాజీ CMకు చెప్పినా వినలేదు. కూటమి రాకపోయుంటే రైతుల భూములు గోవిందా గోవిందా. రాజముద్ర వేసి మళ్లీ పాస్‌బుక్స్ ఇస్తున్నాం. మీ భూరికార్డులను ఎవరూ మార్చలేరు. మోసం చేయలేరు’ అని స్పష్టం చేశారు.

News January 9, 2026

ఈ మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వద్దు

image

మన ఇళ్లు, పొలాల గట్ల దగ్గర పెంచుకోదగ్గ మొక్కల్లో అరటి, బొప్పాయి, జామ, నిమ్మ, ఉసిరి, మునగ, అవిసె, పందిరి చిక్కుడు, బచ్చలి, గుమ్మడి, కరివేపాకు, కుంకుడు మొదలైనవి ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఈ మొక్కలను ఒకసారి నాటితే ఎక్కువకాలం ఫలాలనిస్తాయి. వీటి పెంపకానికి పెద్దగా ఖర్చు కానీ, యాజమాన్యం కానీ అవసరం ఉండదు. ఇవి తక్కువ విస్తీర్ణంలో పెరుగుతూ ఎక్కువ పోషక విలువలు గల ఆహారాన్నిస్తూ మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

News January 9, 2026

మంత్రి చెప్పినా ఎందుకు పెంచారు.. టికెట్ ధరలపై HC ఆగ్రహం

image

TG: ‘రాజా సాబ్’ టికెట్ రేట్ల పెంపుపై హైకోర్టు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే రేట్లు ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించింది. ఎన్నిసార్లు చెప్పినా మీ ఆలోచనా విధానం మారదా? అని ఫైరయింది. టికెట్ రేట్లు పెంచబోమని మంత్రి ప్రకటించినా ఎందుకు మెమోలు జారీ చేస్తున్నారని ప్రశ్నించింది. మెమో ఇచ్చిన అధికారికి రూల్స్ తెలియవా? అని నిలదీసింది. కాగా అర్ధరాత్రి టికెట్ రేట్ల పెంపుపై ఓ లాయర్ కోర్టుకెళ్లారు.