News November 5, 2024

సరస్వతి పవర్ భూములు పరిశీలిస్తున్న పవన్ కళ్యాణ్

image

AP: పల్నాడు జిల్లా మాచవరంలో సరస్వతి పవర్ భూములను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు పవన్ వద్ద వాపోయారు. ‘అప్పట్లో తక్కువ ధరకే భూములు లాక్కున్నారు. మా పిల్లలకు ఉద్యోగాలిస్తామని చెప్పారు. ఏళ్లు గడుస్తున్నా కంపెనీ పెట్టలేదు.. ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆ సంస్థకు ఇచ్చిన లీజును రద్దు చేయాలి. లేదంటే పరిశ్రమ పెట్టి ఉపాధి కల్పించాలి’ అని వారు డిమాండ్ చేశారు.

Similar News

News January 27, 2026

ఫిబ్రవరి తొలివారంలో రైతులకు రూ.2వేలు?

image

దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు శుభవార్త చెప్పేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం అదే వారంలో పీఎం కిసాన్ పథకంలో భాగంగా అన్నదాతల ఖాతాల్లో రూ.2వేల చొప్పున జమ చేస్తుందని సమాచారం. మరోవైపు ఏపీ ప్రభుత్వం మరో రూ.4వేలు కలిపి మొత్తం రూ.6వేలను అన్నదాతలకు అందించే అవకాశం ఉంది. కాగా రైతులు తప్పనిసరిగా E-KYC చేయించుకోవాలి. లేదంటే డబ్బులు జమ కావు.

News January 27, 2026

లంకను గెలిచిన ఇంగ్లండ్.. సిరీస్ కైవసం

image

శ్రీలంకతో జరిగిన <<18976263>>మూడో వన్డేలో<<>> ఇంగ్లండ్ 53 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. 358 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన లంక 46.4 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. పవన్ రత్ననాయకే 121, పాతుమ్ నిస్సాంక 50 మినహా అందరూ విఫలమయ్యారు. కాగా మూడు టీ20ల సిరీస్ జనవరి 30 నుంచి ప్రారంభమవుతుంది.

News January 27, 2026

MLA వ్యవహారంలో నిజమేంటో తేల్చాలి: శైలజ

image

AP: జనసేన MLA <<18975483>>అరవ శ్రీధర్‌<<>>పై SMలో వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. బాధితురాలితో ఫోన్‌లో మాట్లాడి ఘటనపై వివరాలు సేకరించినట్లు తెలిపారు. మహిళ గౌరవం, భద్రతకు భంగం కలిగించే చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. ఘటనలో నిజానిజాలు తేల్చి బాధితురాలికి అండగా ఉంటామన్నారు. దీనిపై జనసేన అంతర్గత బృందం విచారణ జరిపి పవన్‌కు నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.