News November 5, 2024
కులగణనను 2025 జనగణనలోకి తీసుకోవాలి: రేవంత్

TG: భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కుల గణన చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాహుల్ నేతలకు మాట ఇస్తే అది శాసనమని అన్నారు. కులగణన పూర్తి చేసి బీసీలకు న్యాయంగా అందాల్సిన రిజర్వేషన్లు అందిస్తామని చెప్పారు. దీనిని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని 2025 జనగణనలో పరిగణనలోకి తీసుకోవాలని తీర్మానం చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.
Similar News
News December 31, 2025
ధనుర్మాసం: పదహారో రోజు కీర్తన

‘మా ప్రభువైన నందగోపుని భవన రక్షకుడా! మాకు లోనికి వెళ్లే అనుమతివ్వు. మేము గొల్లభామలం, కృష్ణుని దర్శించి సుప్రభాత సేవ చేయడానికి పరిశుద్ధులమై వచ్చాం. ఇంద్రనీల మణివర్ణము గల ఆ స్వామి, మాకు వాద్యము నిస్తానని వాగ్దానం చేశాడు. మేము అజ్ఞానులమైనా ఆయనపై అపారమైన ప్రేమ కలిగిన వారం. కాబట్టి మమ్ములను అడ్డుకోకుండా ఆ మణుల గడియను తెరిచి, స్వామిని చేరుకునేందుకు సహకరించమని ద్వారపాలకుడిని వేడుకుంటున్నాం. <<-se>>#DHANURMASAM<<>>
News December 31, 2025
2025లో చివరి రోజు.. మీ గోల్స్ సాధించారా?

కాలచక్రం గిర్రున తిరిగింది. 2025 ముగింపుకొచ్చింది. ఇంకో రోజే మిగిలింది. ఇల్లు కట్టుకోవాలని, కారు/బైక్ కొనాలని, ఉద్యోగం సాధించాలని ఇలా ఎన్నో గోల్స్ పెట్టుకుని ఉంటారు. మరోవైపు జిమ్/రన్నింగ్ చేయాలని, డ్రింక్/స్మోకింగ్ మానేస్తానని, కొత్త ప్రదేశాలు చుట్టిరావాలని, రోజూ డైరీ రాయాలని ఇంకెన్నో రెజల్యూషన్స్ అనుకుని ఉంటారు. మరి మీరు పెట్టుకున్న గోల్స్ను సాధించారా? రెజల్యూషన్స్ కొనసాగించారా? కామెంట్ చేయండి.
News December 31, 2025
ఇవాళ డెలివరీ బాయ్స్ సమ్మె.. కంపెనీల బెదిరింపులు!

స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ తదితర సంస్థల డెలివరీ ఏజెంట్లు ఇవాళ <<18710950>>సమ్మె<<>> చేయనున్నారు. 1.5 లక్షల మంది ఇందులో పాల్గొంటారని యూనియన్లు చెబుతున్నాయి. అయితే డెలివరీ బాయ్స్ను కంపెనీలు బెదిరిస్తున్నట్లు ఆరోపిస్తున్నాయి. మళ్లీ పనిలోకి రాకుండా IDలు బ్లాక్ చేస్తామని హెచ్చరిస్తున్నట్లు పేర్కొంటున్నాయి. మరోవైపు వర్క్ కొనసాగించాలని కొన్ని కంపెనీలు సెలబ్రిటీలతో యాడ్స్ చేయించాయి.


