News November 6, 2024

ప్రమాదాల నివారణకు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి

image

పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు యాజమాన్యం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ హాల్లో పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు ముందు జాగ్రత్త చర్యలపై జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమలలో ప్రమాదం జరిగితే సంబంధిత తహశీల్దార్, ఆర్డీవోకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు.

Similar News

News January 2, 2026

నెల్లూరు: చిన్నారి డెడ్ బాడీ కలకలం

image

నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక జగనన్న కాలనీలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో గుర్తుతెలియని చిన్నారి మృతదేహం లభ్యమైంది. చిన్నారి మృతదేహం చూసిన కాలనీవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 2, 2026

నెల్లూరోళ్లు రూ. 143.75 కోట్ల మద్యం తాగేశారు..

image

నెల్లూరు జిల్లాలో గతేడాది మద్యం ఏరులై పారింది. 2024 డిసెంబర్ నాటికి రూ.139.5 కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే.. 2025 ఆ లెక్కను దాటేసింది. నెల్లూరోళ్లు గడిచిన డిసెంబర్ నాటికి రూ. 143.75 కోట్ల మద్యాన్ని తాగేశారు. 2024 తో పోలిస్తే.. రూ. 4 కోట్ల మేరా అధికంగా అమ్మకాలు జరిగాయి. దీన్ని బట్టి చూస్తేనే.. జిల్లాలో మద్యం విక్రయాలు ఎంత జోరుగా సాగుతున్నాయో తెలుస్తోంది.

News January 2, 2026

వెంకటాచలంలో దారుణం.. కొడుకుని హత్య చేసిన తండ్రి

image

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం, కంటేపల్లిలో దారుణం చోటుచేసుకుంది. తండ్రి రమణయ్య తన కొడుకు రఘురామయ్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. గుట్టు చప్పుడు కాకుండా దహన సంస్కారాలు చేసేందుకు తీసుకెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.