News November 6, 2024

ప్రమాదాల నివారణకు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి

image

పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు యాజమాన్యం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ హాల్లో పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు ముందు జాగ్రత్త చర్యలపై జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమలలో ప్రమాదం జరిగితే సంబంధిత తహశీల్దార్, ఆర్డీవోకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు.

Similar News

News December 29, 2025

నెల్లూరు నుంచి 2 మండలాలు ఔట్.!

image

<<18703339>>నెల్లూరు<<>> జిల్లాలో ఇక నుంచి 36 మండలాలు ఉండనున్నాయి. ఇది వరకు 38 ఉండేవి. కందుకూరు నియోజకవర్గం (5 మండలాలు)ను తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపారు. మరోవైపు గూడూరు నియోజకవర్గంలోని 3 మండలాలు(గూడూరు, కోట చిల్లకూరు) మండలాలను తిరిగి నెల్లూరులో కలిపారు. దీంతో మొత్తం మీద జిల్లాలో మండలాల సంఖ్య 36కు చేరింది.

News December 29, 2025

నెల్లూరు జిల్లాలో గూడూరు.. ట్విస్ట్ ఇదే.!

image

గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి నుంచి మళ్లీ నెల్లూరు జిల్లాలో కలుపుతూ క్యాబినేట్ నిర్ణయం తీసుకుంది. అయితే గూడూరు, చిల్లకూరు, కోట మండలాలను మాత్రమే నెల్లూరులో కలిపారు. చిట్టమూరు, వాకాడు మండలాలు తిరుపతి జిల్లాలోనే కొనసాగనున్నాయి. వాకాడులో దుగరాజపట్నం పోర్ట్ కారణంగానే ఆ మండలాన్ని తిరుపతిలో కొనసాగించనున్నారు. చిట్టమూరు సైతం తిరుపతికి దగ్గరగా ఉంటుంది.

News December 29, 2025

OFFICIAL: నెల్లూరులోకి గూడూరు.!

image

గూడూరు నియోజకవర్గాన్ని తిరిగి నెల్లూరు జిల్లాలో కలపాలని అధికారికంగా నిర్ణయించారు. ఈ మేరకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కొత్త మార్పులు జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. మరోవైపు వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు, సైదాపురం, కలువాయి మండలాలను సైతం నెల్లూరు జిల్లాలోకి తీసుకురానున్నారు.