News November 6, 2024
నిందితుడిని పట్టించిన ఈగలు..!

మధ్యప్రదేశ్లో ఓ హత్య కేసు నిందితుడిని ఈగలు పట్టించాయి. జబల్పూర్ జిల్లాకు చెందిన మనోజ్ ఠాకూర్ (25) హత్యకు గురయ్యాడు. హత్యాస్థలంలో విచారణ చేస్తుండగా గుంపులోని ధరమ్ ఠాకూర్ (19) అనే వ్యక్తిపై ఈగలు వాలడాన్ని పోలీసులు గమనించారు. అతడి దుస్తులు, ఛాతిపై రక్తపు మరకలు ఉన్నాయి. ఫొరెన్సిక్ టెస్ట్లో మృతుడి రక్తపు మరకలేనని తేలింది. మద్యం తాగే క్రమంలో గొడవ జరిగి హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు
Similar News
News September 15, 2025
దారుణం.. నిద్రిస్తున్న విద్యార్థుల కళ్లలో ఫెవిక్విక్

ఒడిశాలో ఓ హాస్టల్ విద్యార్థి చేసిన తుంటరి పని తోటి విద్యార్థులు ప్రాణాల మీదకు తెచ్చింది. కంధమాల్ జిల్లా సలాగూడలోని సెబాశ్రమ్ స్కూల్ హాస్టల్లో నిద్రిస్తున్న 8 మంది విద్యార్థుల కళ్లలో ఓ స్టూడెంట్ ఫెవిక్విక్ వేశాడు. ఈ ఘటనతో వారి కళ్లు మూసుకుపోయాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఒకరికి కళ్లు పూర్తిగా తెరుచుకోగా మిగతావారికి అలాగే ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News September 15, 2025
CSIRలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి

<
News September 15, 2025
ఇవాళ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

TG: రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, సిద్దిపేటలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇతర చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. నిన్న రాత్రి హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో వర్షం దంచి కొట్టిన సంగతి తెలిసిందే.