News November 6, 2024

ఆరోగ్యశ్రీపై ప్రభుత్వం కీలక నిర్ణయం!

image

TG: ఆరోగ్య శ్రీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేలా ఎంప్యానెల్ ఆస్పత్రుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం నిబంధనలను సులభతరం చేయనుంది. 50 పడకలు ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులకు ఎంప్యానెల్ అయ్యే అవకాశం కల్పించనున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న 347 ఆస్పత్రులకు మరో 150 జత అవుతాయి. ఆస్పత్రుల అనుమతులపై నిర్ణయం తీసుకునే ఎంప్యానెల్ డిసిప్లినరీ కమిటీని రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News September 15, 2025

వెంటనే రూ.10వేల కోట్లు విడుదల చేయండి: సబిత

image

TG: విద్యార్థుల జీవితాలతో సీఎం రేవంత్ రెడ్డి చెలగాటం ఆడుతున్నారని BRS నేత సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. ‘ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు రాక ప్రైవేట్ కాలేజీలు మూతపడే పరిస్థితి ఉంది. దాదాపు 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఇప్పటివరకు బకాయి పడ్డ రూ.10వేల కోట్ల నిధులు వెంటనే విడుదల చేయండి. మేము కరోనా సమయంలో ఒక్క రూపాయి ఆదాయం రాకపోయినా నిధులు ఆపలేదు’ అని ట్వీట్ చేశారు.

News September 15, 2025

షాపుల్లో GST తగ్గింపు బోర్డులు తప్పనిసరి: నిర్మల

image

GST తగ్గింపుతో 140కోట్ల మందికి ఉపశమనం లభించనుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. చెన్నైలో జరిగిన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘ఈనెల 22 నుంచి పన్ను తగ్గింపు అమలులోకి వస్తుంది. GST తగ్గింపు వివరాలతో అన్ని దుకాణాల్లో బోర్డులు పెట్టాలి. ఈ మేరకు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశాం. 350కి పైగా వస్తువుల ధరలు తగ్గనున్నాయి. అది సరిగ్గా అమలయ్యేలా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలి’ అని సూచించారు.

News September 15, 2025

ఫ్లో దెబ్బతింటుందనే పాటలు పెట్టలేదు: మిరాయ్ డైరెక్టర్

image

మిరాయ్ మూవీలో వైబ్ ఉంది బేబీ సాంగ్‌తోపాటు నిధి అగర్వాల్‌తో చేసిన ఓ పాటను కూడా మేకర్స్ పక్కన పెట్టేశారు. దీనిపై డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని స్పందించారు. మూవీ ఫ్లో దెబ్బతింటుందనే ఈ సాంగ్స్ పెట్టలేదని చెప్పారు. నిధి అగర్వాల్ పాట షూట్ చేసింది ఫస్ట్ పార్ట్ కోసం కాదని ఆయన క్లారిటీ ఇచ్చారు. అది రెండో పార్ట్ కోసమే తీసినట్లు హింట్ ఇచ్చారు. అయితే ‘వైబ్ ఉంది బేబీ’ పాటపై ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్పలేదు.