News November 6, 2024
గ్రూప్-4 అభ్యర్థుల ‘పోస్ట్ కార్డు’ నిరసన

TG: గ్రూప్-4 పరీక్ష తుది ఫలితాల కోసం అభ్యర్థులు వినూత్న నిరసనకు దిగారు. పరీక్ష జరిగి దాదాపు 500 రోజులు కావస్తున్నా నియామకాలు జరగకపోవడంతో TGPSCకి భారీ సంఖ్యలో పోస్ట్ కార్డుల ద్వారా వినతిపత్రాలు పంపించారు. ఫలితాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సెలక్షన్ లిస్ట్ విడుదల చేసి 8 వేల మంది అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు.
Similar News
News January 25, 2026
రథ సప్తమి గురించి ‘యోగశాస్త్రం’ ఏం చెబుతుందంటే..?

యోగశాస్త్రం ప్రకారం మన శరీరంలో ఇడా, పింగళ అనే 2 నాడులుంటాయి. ఇందులో పింగళ నాడి సూర్య నాడికి సంకేతం. ప్రాణాయామం ద్వారా ఈ నాడులను శుద్ధి చేసినప్పుడు కుండలినీ శక్తి మేల్కొంటుంది. సూర్యుడు బాహ్య ప్రపంచానికి వెలుగునిస్తే, యోగ సాధన ద్వారా మనలోని చిదాత్మ ప్రకాశిస్తాడు. రథసప్తమి నాడు చేసే సాధన మనలోని ఈ అంతర్గత శక్తిని మేల్కొల్పుతుంది. అందుకే ఈ పర్వదినాన కొద్దిసేపైనా యోగా చేయాలని పండితులు సూచిస్తారు.
News January 25, 2026
నేడే మూడో టీ20.. గెలిస్తే భారత్దే సిరీస్

భారత్, న్యూజిలాండ్ మధ్య ఈరోజు గువాహటిలో 3rd T20 జరగనుంది. ఇప్పటికే తొలి 2 మ్యాచులు గెలిచిన IND ఇందులోనూ గెలిస్తే సిరీస్ సొంతం చేసుకుంటుంది. అక్షర్, బుమ్రా తిరిగి తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. మరోసారి 200+ స్కోర్ నమోదవ్వొచ్చని అంచనా.
IND XI (అంచనా): అభిషేక్, శాంసన్, ఇషాన్, సూర్య, హార్దిక్, దూబే, రింకూ, అక్షర్/కుల్దీప్, బుమ్రా/హర్షిత్, అర్ష్దీప్, వరుణ్
LIVE: 7PM నుంచి Star Sports, Hotstar
News January 25, 2026
యాలకులతో ఆరోగ్య ప్రయోజనాలు

యాలకుల్లో ఉండే జింక్, ఐరన్, విటమిన్ సి, రిబోఫ్లావిన్, సల్ఫర్, నియాసిన్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ‘ఇవి తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం, కడుపునొప్పి, అసిడిటీ వంటి సమస్యలు పోతాయి. నోటి దుర్వాసన పోతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శ్వాసకోశ సమస్యలు పోతాయి. వీటిలోని ఎంజైమ్లు శరీరంలోని కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి’ అని అంటున్నారు.


