News November 6, 2024
అలా చేస్తే 10-14 ఏళ్లు జైలు శిక్ష: మంత్రి

AP: రాష్ట్ర చరిత్రలో ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ మైలురాయిగా నిలుస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల భూములకు కొత్తగా తెచ్చే ఈ చట్టం వర్తిస్తుందని తెలిపారు. ఎవరైనా కబ్జాలకు పాల్పడితే 10-14 ఏళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించేలా చట్టాన్ని రూపొందించినట్లు చెప్పారు. జగన్ పాలనలో వైసీపీ గుండాలు విచ్చలవిడిగా భూ కబ్జాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు.
Similar News
News January 27, 2026
వీరమ్మతల్లి తిరునాళ్లు.. ప్రత్యేకతలెన్నో..

AP: ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లు రేపే ప్రారంభం. 15రోజుల వేడుకలకు ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల భక్తులు వస్తారు. తొలిరోజు పోలీస్ శాఖ తరఫున మొదటి పసుపు, కుంకుమ సమర్పించాక మెట్టినింటి నుంచి ఆలయానికి అమ్మ బయల్దేరడం ఆనవాయితీ. ఇక ఆసక్తికర శిడిబండి ఉత్సవం FEB7న. ప్రత్యేకంగా తయారుచేసిన బండిలో పెట్టిన గంపలో, పెళ్లి కాబోయే SC యువకుడిని కూర్చోబెట్టి ఆలయం చుట్టూ బండి తిప్పుతూ అరటికాయలతో కొడతారు.
News January 27, 2026
బెంగళూరు అంకుల్ అంటూ జగన్పై టీడీపీ సెటైర్లు

AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్పై టీడీపీ Xలో సెటైరికల్ పోస్ట్ చేసింది. ‘ఏ బెంగ, బెదురులేని దొంగ బెంగళూరు అంకుల్. ఆయనకు దేశభక్తి లేదు, దైవభక్తి లేదు. సంక్రాంతికి సొంతూరు రాడు. రిపబ్లిక్ డేని పట్టించుకోడు’ అని పేర్కొంది. దీనిపై వైసీపీ శ్రేణులు ఫైరవుతున్నాయి. ముందు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి అంటూ కౌంటర్ ఇస్తున్నాయి.
News January 27, 2026
రైలు ఆలస్యంతో పరీక్షకు గైర్హాజరు.. విద్యార్థినికి రూ.9లక్షల పరిహారం

UPలోని బస్తీ జిల్లాకు చెందిన సమృద్ధి అనే విద్యార్థిని 7ఏళ్ల న్యాయ పోరాటం తర్వాత రైల్వేపై కేసు గెలిచింది. 2018లో రైలు ఆలస్యం వల్ల ఆమె Bsc ప్రవేశ పరీక్ష రాయలేకపోయింది. దీంతో పరిహారం కోరుతూ జిల్లా వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించింది. రైలు ఆలస్యమవడంపై అధికారుల నుంచి సరైన వివరణ రాకపోవడంతో ఆమెకు 45 రోజుల్లో రూ.9.10L చెల్లించాలని కోర్టు ఆదేశించింది. చెల్లింపు ఆలస్యమైతే 12% వడ్డీ చెల్లించాలని పేర్కొంది.


