News November 6, 2024
గవర్నర్ను కలిసిన షబ్బీర్ అలీ

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనకు పుష్పగుచ్ఛం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన కుటుంబ సమగ్ర సర్వే వివరాలను ఆయనకు వివరించారు. కాగా ఈ కార్యక్రమం పట్లు ఆయన హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News January 23, 2026
NZB: 24న జిల్లా స్థాయి సైక్లింగ్ ఎంపికలు

సిద్దిపేటలో జరగనున్న 10వ రాష్ట్రస్థాయి మౌంటెన్ బైక్ సైక్లింగ్ పోటీల కోసం జిల్లా జట్టు ఎంపికలు ఈ నెల 24న నిర్వహించనున్నట్లు కార్యదర్శి విజయ్ కాంతారావు తెలిపారు. కంటేశ్వర్ బైపాస్ రోడ్డులో అండర్-14, 16, 18 విభాగాల్లో బాలురు, బాలికలకు ఎంపికలు ఉంటాయి. ఆసక్తి గల క్రీడాకారులు ఉదయం 8 గంటలకు రిపోర్ట్ చేయాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News January 23, 2026
NZB: అండమాన్కు అజాద్ హిందూ పేరు పెట్టాలని కవిత లేఖ

అండమాన్కు అజాద్ హిందూ పేరు పెట్టాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి NZB మాజీ MP, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత లేఖ రాశారు. జాగృతి కూడా ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ల డిమాండ్ను సపోర్ట్ చేస్తోందన్నారు. తమకున్న నెట్వర్క్తో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ డిమాండ్ వచ్చేలా చేస్తామని లేఖలో పేర్కొన్నారు. అండమాన్ నికోబార్ పేరును బ్రిటీష్ వాళ్లు పెట్టారన్నారు.
News January 23, 2026
NZB: హై-టెక్ నైపుణ్యాలు అందాలన్నదే ప్రభుత్వ సంకల్పం: సుదర్శన్

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు హై-టెక్ నైపుణ్యాలు అందాలన్నదే ప్రభుత్వ సంకల్పమని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన స్కిల్ డెవలప్మెంట్ ఇనీషియేటివ్ ప్రోగ్రాంలో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.


