News November 7, 2024
వరంగల్: కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు

హనుమకొండ జిల్లా సమీకృత భవనంలో హనుమకొండ, వరంగల్ కలెక్టర్లతో ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులు నాయిని రాజేందర్ రెడ్డి, కెఆర్ నాగరాజు, కడియం కావ్య, గుండు సుధారాణి పాల్గొన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక ఉమ్మడి వరంగల్ జిల్లాపై ప్రత్యేక కార్యాచరణతో అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని అమలు చేసే దిశగా ముందుకెళ్తున్నట్లు నేతలు తెలిపారు.
Similar News
News January 21, 2026
గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు: వరంగల్ కలెక్టర్

జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పని చేసి యువత, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని జిల్లా కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోవడంతో పాటు, మత్తు పదార్థాలకు అలవాటు పడితే కలిగే నష్టాలపై ప్రజలకు, ముఖ్యంగా యువతకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
News January 21, 2026
వరంగల్: మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాలకు ఆహ్వానం

వరంగల్ జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి మైనారిటీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాలోని ఐదు మైనారిటీ గురుకులాల్లో (ఆంగ్ల మాధ్యమం) 5వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ) కోర్సులకు ప్రవేశాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
News January 20, 2026
జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలి: వరంగల్ కలెక్టర్

జిల్లాలో ఈనెల 25న నిర్వహించనున్న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. ఆమె మాట్లాడుతూ.. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఓటు హక్కు ప్రాముఖ్యతను ప్రజలకు విస్తృతంగా చేరవేయాలని సూచించారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలు, కళాశాలల్లో ఓటు ప్రాధాన్యతపై వ్యాసరచన పోటీలు నిర్వహించాలన్నారు.


