News November 7, 2024

విషాదం.. తండ్రీకూతురి మృతి

image

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న రమేశ్, ఆయన కూతురు భవిత నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వారిని అనంతపురానికి తరలించి చికిత్స అందిస్తుండగా తండ్రీకూతురు మృతి చెందారు. 10వ తరగతి చదువుతున్న భవిత స్టేట్ లెవెల్ హోకీ పోటీలకు హాజరై తిరిగి వస్తుండగా గుట్టూరు వద్ద వారు ప్రమాదానికి గురయ్యారు. తండ్రీకూతురి మృతి ఆ కుటుంబంలో విషాదం నింపింది.

Similar News

News March 31, 2026

నిబంధనలు పాటించలేదా ఇకపై చర్యలు తప్పవు: ఏఎస్పీ

image

తాడిపత్రిలో అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు భద్రతే ద్యేయంగా ముందుకు వెళ్తున్నారు. తాడిపత్రి బైపాస్‌లో టౌన్ సీఐ ఆరోహణరావుతో కలిసి నిబంధనలు పాటించని పలు వాహనదారులకు కౌన్సెలింగ్ ఇవ్వడమే కాకుండా.. హెల్మెట్లు ధరించని వాహనదారులకు రూ.1,035 జరిమాన విధించారు. హెల్మెట్లు తప్పకుండా ధరించాలని సూచించారు.

News March 30, 2026

సమాజంలో పేదరికాన్ని నిర్మూలిద్దాం: కలెక్టర్

image

పీ-4 కార్యక్రమాన్ని ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్బంగా.. సోమవారం అనంతపురం జేఎన్టీయూలోని కళాశాల ఆడిటోరియంలో అవగాహన సదస్సుని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ ఆనంద్ పాల్గొని మాట్లాడుతూ.. సమాజంలో పేదరికాన్ని నిర్మూలిద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపీ వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ స్వప్న, మార్కెట్ యార్డు ఛైర్ పర్సన్ బల్లా పల్లవి పాల్గొన్నారు.

News March 29, 2026

నేడు ఎల్లనూరు మండలానికి హీరో విజయ్ దేవరకొండ రాక

image

ఎల్లనూరు మండలంలో నేడు హీరో విజయ్ దేవరకొండ పర్యటించనున్నారు. మండల పరిధిలోని జంగంపల్లి కోట వద్ద ‘రణబలి’ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. అందుకు తగ్గ ఏర్పాట్లను సిద్ధం చేశారు. పుట్లూరు సీఐ సత్యబాబు బందోబస్తు చేపట్టారు.