News November 7, 2024

రేపటి నుంచి ఇండియా, సౌతాఫ్రికా టీ20 సిరీస్

image

ఇండియా, సౌతాఫ్రికా మధ్య 4 మ్యాచుల టీ20 సిరీస్ రేపటి నుంచి జరగనుంది. 2024 టీ20 WC ఫైనల్ తర్వాత ఇరు జట్లు తలపడటం ఇదే తొలిసారి. ఈ ఫార్మాట్‌లో ఇప్పటివరకూ రెండు జట్ల మధ్య 27 మ్యాచులు జరిగాయి. భారత్ 15, దక్షిణాఫ్రికా 11 మ్యాచుల్లో గెలవగా, ఒక మ్యాచులో ఫలితం తేలలేదు. తొలి టీ20 రేపు రా.8.30 గంటలకు డర్బన్ వేదికగా ప్రారంభం అవుతుంది. జియో సినిమా యాప్, స్పోర్ట్స్ 18 టీవీ ఛానల్‌లో లైవ్ చూడొచ్చు.

Similar News

News February 1, 2026

డ్యూటీలో ప్రాణాలు కోల్పోవడంపై సీఎం ఆవేదన

image

TG: నిజామాబాద్‌కు చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ <<19017490>>సౌమ్య<<>> మృతి ప‌ట్ల ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. విధి నిర్వహ‌ణ‌లో ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. సౌమ్య మృతికి కార‌ణ‌మైన వారిపై క‌ఠిన‌చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసు అధికారుల‌ను ఆదేశించారు. ఆమె కుటుంబానికి ప్ర‌భుత్వం అన్ని విధాలుగా అండ‌గా ఉంటుంద‌ని సీఎం హామీ ఇచ్చారు.

News February 1, 2026

కాటన్ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు

image

గువాహటిలోని కాటన్ యూనివర్సిటీలో 9 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీ, డాక్యుమెంట్స్‌ను ఫిబ్రవరి 9 వరకు పోస్ట్ చేయాలి. దరఖాస్తు ఫీజు రూ.1000, SC,STలకు రూ.500. వెబ్‌సైట్: https://cottonuniversity.ac.in/

News February 1, 2026

40% GST.. భారీగా పెరిగిన ధరలు

image

పొగాకు ఉత్పత్తులపై విధించిన 40% జీఎస్టీ నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఆ పన్నుతో పాటు అదనంగా ఎక్సైజ్ డ్యూటీ, హెల్త్ సెస్ విధించడంతో సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కాల ధరలు భారీగా పెరిగాయి. హానికర ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే మార్కెట్లో పొగాకు ఉత్పత్తుల ధరలు ఇప్పటికే పెంచి అమ్ముతున్నారు.