News November 7, 2024
హ్యూమన్ ట్రాఫికింగ్.. ఆరుగురికి జీవితఖైదు

TG: మానవ అక్రమ రవాణా కేసులో ఆరుగురికి ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు విధించింది. నిందితులు యూసఫ్ ఖాన్, బీతీ బేగం, రాహుల్, అబ్దుల్ సలాం, షీలా, సోజీబ్లు ఉద్యోగాల పేరుతో బంగ్లాదేశ్ నుంచి మహిళలను తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచారంలోకి దించినట్లు కోర్టు తేల్చింది. 2019లో ఓల్డ్ సిటీలోని ఛత్రినాక పోలీస్ స్టేషన్లో కేసు నమోదవడంతో NIA మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Similar News
News February 18, 2026
పార్వతీపురం: ‘సీఎస్సీ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు’

పార్వతీపురం జిల్లాలో మంజూరైన కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సుల నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సీఎస్సీల నిర్మాణాలపై సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలన్నారు.
News February 18, 2026
కొచ్చిన్ యూనివర్సిటీలో టెక్నికల్ పోస్టులు

<
News February 18, 2026
ఎందుకలా: ఉప్పగానే సముద్రపు నీరు..

వర్షం పడినప్పుడు నీరు గాలిలోని CO₂తో కలిసి ఆమ్లంగా మారుతుంది. ఆ తర్వాత నదుల్లోకి చేరి రాళ్లు, మట్టిని కరిగిస్తూ సోడియం, క్లోరైడ్ వంటి లవణాలను సముద్రంలో చేరుస్తుంది. ఆపై సూర్యుడి వేడితో నీరు ఆవిరైనప్పుడు లవణాలు సముద్రంలో మిగిలిపోతాయి. ఇలా కోట్లాది ఏళ్లుగా జరుగుతూ సముద్ర నీటి సగటు లవణీయత 3.5%కి చేరింది. ఇందులో 85% Nacl ఉంటుంది. సముద్ర గర్భంలో ఉండే హైడ్రోథర్మల్ వెంట్స్ కూడా లవణాల వృద్ధికి సాయపడతాయి.


