News November 8, 2024
సమోసాల మిస్సింగ్పై నో ఎంక్వైరీ: CID

హిమాచల్ ప్రదేశ్ CID ఆఫీసులో సమోసాలు మిస్ అవ్వడంపై అధికారికంగా ఎలాంటి విచారణకు ఆదేశించలేదని DG సంజీవ్ రంజన్ తెలిపారు. CM సుఖ్వీందర్ సింగ్ పాల్గొన్న సమావేశంలో అతిథుల కోసం తెప్పించిన స్నాక్స్ ప్యాకెట్లు కనిపించకపోవడంతో అధికారులు వాటి కోసం వెతికారని వెల్లడించారు. ఇదో సామాన్యమైన అంతర్గత విషయమన్నారు. బాక్సులను వెతికేందుకు కేవలం అప్పీల్ చేశామన్నారు. దీన్ని రాజకీయం చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
Similar News
News February 18, 2026
ఆయుష్ మంత్రిత్వశాఖలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

న్యూఢిల్లీలోని <
News February 18, 2026
ఫాల్గుణ మాసంలో ఇలా చేయండి: పండితులు

మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన మాసం ఫాల్గుణం. ఈ నెలలో లక్ష్మీనారాయణులను భక్తితో కొలిస్తే శుభాలు కలుగుతాయని పండితుల మాట. ‘చంద్రుడు ఫల్గుణి నక్షత్రం సమీపంలో ఉండటం వల్ల దీనికి ఆ పేరొచ్చింది. అర్జునుడికి ‘ఫల్గుణుడు’ అనే పేరుండటం మరో ప్రత్యేకత. దానధర్మాలు చేయడం, పవిత్ర నదులలో స్నానమాచరించడం వల్ల పుణ్యం లభిస్తుంది. ప్రకృతి వసంతానికి సిద్ధమయ్యే ఈ కాలంలో ఆధ్యాత్మిక చింతనతో గడపడం ఉత్తమం’ అంటున్నారు.
News February 18, 2026
మిరప మొక్కల వేర్లపై బొడిపెలకు కారణమేంటి?

మిరప పంటకు నులి పురుగులు ఆశించడం వల్ల మొక్కల వేర్లపై బొడిపెలు ఏర్పడతాయి. దీని వల్ల పంటకు నష్టం వాటిల్లుతుంది. ఈ నులి పురుగుల నివారణకు ఎకరాకు 100 కిలోల వేప పిండిని చల్లి, మట్టిలో కలిసే విధంగా నీరు పెట్టాలి. ఈ పురుగులు ఆశించిన పొలంలో వంగ, టమాటా, బంగాళాదుంపలను సాగు చేయకూడదు. ఆవాలు, నువ్వులు, మొక్కజొన్న, చిరుధాన్యాలతో పంట మార్పిడి చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


