News November 8, 2024
FLASH: కామారెడ్డి: విషాదం.. బైక్ టైరు పేలి చనిపోయాడు..!

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోయిన ఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం అంతంపల్లి గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. దోమకొండ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన స్వామిగౌడ్ బైక్పై వస్తుండగా ఒక్కసారిగా టైరు పేలింది. దీంతో పక్కనే ఉన్న రోడ్డు సీలింగ్కు వేగంగా ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
Similar News
News November 10, 2025
నిజామాబాద్: ప్రజావాణిలో 16 ఫిర్యాదులు స్వీకరించిన సీపీ

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా నిజమాబాద్ సీపీ సాయి చైతన్య సోమవారం ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ మేరకు కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో 16 ఫిర్యాదులను స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. సీపీ మాట్లాడుతూ.. ప్రజలు నిర్భయంగా తమ ఫిర్యాదులను అందించవచ్చని సూచించారు.
News November 10, 2025
NZB: అజారుద్దీన్ను కలిసిన రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్

మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా నియమితులై సోమవారం మంత్రిగా రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన మహమ్మద్ అజారుద్దీన్ను రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మైనారిటీల అభివృద్ధికి, సంక్షేమానికి మరింత కృషి చేయాలని అజారుద్దీన్ను తాహెర్ బిన్ హందాన్ కోరారు.
News November 10, 2025
నిజామాబాద్లో కూరగాయల ధరల వివరాలు..!

నిజామాబాద్ లో కూరగాయల మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట రూ.20 కేజీ, వంకాయ రూ.35, బెండకాయ బీరకాయ, దొండకాయ రూ.50, చిక్కుడు రూ.50, క్యాబేజీ రూ.25, కాలిఫ్లవర్ రూ.50, మిరపకాయ రూ.35, కాకరకాయ రూ.40, బీరకాయ, బెండకాయ రూ.50, దొండకాయ రూ.50, పాలకూర రూ.50, తోటకూర రూ.30, గోరుచిక్కుడు రూ.50, మునగా కాయ రూ.70, ఉల్లిగడ్డ రూ.100కు ఐదు కేజీలు, సొరకాయ రూ.20, క్యారెట్ రూ.50లకు కేజీ ధర పలుకుతున్నాయి.


