News November 8, 2024

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. అదీ ₹10 స్టాంప్ పేప‌ర్‌‌తో

image

పై ఫొటోలో కనిపిస్తున్న ₹500 నోటు చూడటానికి ఒరిజినల్‌గా క‌నిపిస్తున్నా ఇది న‌కిలీది. అది కూడా ₹10 స్టాంప్ పేప‌ర్‌ను ఉప‌యోగించి త‌యారు చేశారు. యూపీలోని సోన్‌భ‌ద్రా జిల్లాకు చెందిన స‌తీశ్ రాయ్‌, ప్ర‌మోద్ మిశ్రా యాడ్స్ ప్రింటింగ్ రంగంలో ప‌నిచేస్తున్నారు. వీరు యూట్యూబ్‌లో నోట్ల త‌యారీ నేర్చుకున్నారు. న‌కిలీ నోట్ల ప్రింటింగ్ ప్రారంభించి ఫర్జీ సిరీస్‌ను రియల్‌గా చూపించారు. చివరికి పోలీసులకు చిక్కారు.

Similar News

News September 14, 2025

బీజేపీలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్సీ

image

AP: మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత BJPలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. ఏడాది క్రితం YCPకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సునీత ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. TDP ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆమె 2017లో MLCగా ఎన్నికయ్యారు. ఆ పార్టీకి రాజీనామా చేసి 2020లో వైసీపీలో చేరి మరోసారి ఎమ్మెల్సీ అయ్యారు. పరిటాల రవి ముఖ్య అనుచరుడు పోతుల సురేశ్ ఈమె భర్త.

News September 14, 2025

పాక్‌తో మ్యాచ్‌కు BCCI దూరం!

image

భారత్, పాక్ మ్యాచ్‌కు BCCI అధికారులు దూరం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. BCCI సెక్రటరీ సైకియా, IPL ఛైర్మన్ ధుమాల్, ట్రెజరర్ ప్రభ్‌తేజ్, జాయింట్ సెక్రటరీ రోహన్ దుబాయ్ వెళ్లేందుకు విముఖత చూపుతున్నట్లు సమాచారం. అటు ICC ఛైర్మన్ జైషా USలో ఉన్నారు. ACC ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఉన్న BCCI సెక్రటరీ శుక్లా మాత్రమే మ్యాచ్ వీక్షించే అవకాశముంది. ఫ్యాన్స్ టార్గెట్ చేస్తారనే కెెమెరా ముందుకు రావట్లేదని తెలుస్తోంది.

News September 14, 2025

దేవాన్ష్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు: లోకేశ్

image

AP: తన కుమారుడు దేవాన్ష్ ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్‌గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు అందుకున్నాడని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్‌ను వేగంగా పరిష్కరించాడని పేర్కొన్నారు. లండన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో తాను పాల్గొన్నానని చెప్పారు. దేవాన్ష్ ముందు చూపు, ఆలోచనా శక్తి, ఒత్తిడిలో ప్రదర్శించిన సమయస్ఫూర్తి వల్లే ఈ విజయం సాధ్యమైందని లోకేశ్ వివరించారు.