News November 8, 2024
గంజాయి కేసులో 108మంది అరెస్ట్: శ్రీకాకుళం SP

శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్లో గంజాయి, డ్రగ్స్ వాడకాన్ని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై ఎస్పీ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మహేశ్వర రెడ్డి, కలెక్టర్ స్వప్నిల్ పుండ్కర్ పాల్గొన్నారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు 37కేసులు నమోదు చేశామని, 108 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. గంజాయి విక్రయాలు, వినియోగం జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Similar News
News January 9, 2026
SKLM: డిగ్రీ విద్యార్థులకు అలర్ట్

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల నోటిఫికేషన్ను పరీక్షల విభాగం అధికారి పద్మారావు గురువారం ఓ ప్రకటనలో విడుదల చేశారు. విద్యార్థులు పరీక్ష ఫీజును ఈనెల 18వ తేదీ లోపు కళాశాలల్లో, యూనివర్సిటీలో చెల్లించాలని సూచించారు. పరీక్షలు ఫిబ్రవరి మొదటి వారం నుంచి నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలకు కాలేజీలకు సంప్రదించాలన్నారు.
News January 9, 2026
శ్రీకాకుళం: సంక్రాంతి ముందు..ప్రయాణికులకు షాక్

శ్రీకాకుళం ఆర్టీసీ హైయర్ బస్సు యజమానులు గురువారం జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణకు సమ్మె నోటీస్ అందజేశారు. ఈనెల 12 నుంచి సమ్మె చేయనున్నట్లు నోటీసులో ప్రస్తావించారు. మహిళల ఉచిత బస్సు పథకం స్త్రీ శక్తిలో భాగంగా బస్సుకు నెలకు అదనంగా రూ.20 వేలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఆక్యుపెన్సీ పెరిగినా గిట్టుబాటు ధర చెల్లించడం లేదని, ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
News January 9, 2026
శ్రీకాకుళం జిల్లాలో రూ.135.37 కోట్లతో విద్యుత్ ఆధునీకరణ పనులు

శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్ ఆధునీకరణ పనులకు రూ 135.37 కోట్లు మంజూరయ్యాయని జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ కృష్ణమూర్తి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు ఈ నిధులను వినియోగిస్తామన్నారు. రూ. 80 కోట్లతో శ్రీకాకుళంలో 132/23 కేవీ విద్యుత్ ఉపకేంద్రం చిలకపాలెం-అంపోలు మధ్యలో నిర్మిస్తారన్నారు. ప్రకృతి వైపరీత్యాల్లో త్వరితగతిన విద్యుత్ సరఫరా అవుతుందన్నారు.


