News November 9, 2024
సీ ప్లేన్ ప్రత్యేకతలు ఇవే?

AP: సీఎం చంద్రబాబు ఇవాళ సీ ప్లేన్లో విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్తారు. విజయవాడ నుంచి శ్రీశైలం వరకు 150 కి.మీ ప్రయాణాన్ని 45 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఇది 20 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించగలిగినా పర్యాటకులకు ప్రకృతి అందాలు చూపేందుకు 1,500 అడుగుల ఎత్తులో వెళ్తుంది. టేకాఫ్, ల్యాండింగ్ రెండూ నీటిపైనే జరుగుతాయి. ఇందులో 14 మంది ప్రయాణించవచ్చు. దీని టికెట్ ధర దాదాపు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఉండొచ్చు.
Similar News
News November 2, 2025
ఈ దున్న ఖరీదు రూ. 23 కోట్లు.. ఎందుకంత స్పెషల్?

హరియాణాకు చెందిన అన్మోల్ అనే ఈ దున్న రాజస్థాన్ పుష్కర్ పశువుల సంతలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 1,500 Kgల బరువుండే ఈ దున్న ఖరీదు రూ.23 కోట్ల పైనే. దీని వీర్యానికి చాలా డిమాండ్ ఉంది. వారానికి 2సార్లు అన్మోల్ వీర్యాన్ని సేకరించి విక్రయిస్తారు. ఇలా నెలకు కనీసం రూ.5 లక్షల ఆదాయం వస్తోంది. దీనికి ఆహారం కోసం నెలకు రూ.50 వేల వరకు ఖర్చవుతోంది.✍️ రోజూ ఇలాంటి సమాచారానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.
News November 2, 2025
రాష్ట్రంలో ‘మిట్టల్ స్టీల్’కు పర్యావరణ అనుమతులు!

AP: అనకాపల్లి సమీపంలో ఆర్సెలార్ మిట్టల్-నిప్పాన్ స్టీల్స్ ఏర్పాటు చేయబోతున్న ఉక్కు పరిశ్రమకు నిపుణుల కమిటీ పర్యావరణ అనుమతులకు సిఫారసు చేసింది. 14 నెలల రికార్డ్ టైమ్లో ఇది సాధ్యమైనట్లు ప్రభుత్వం తెలిపింది. రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమ దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఫ్యాక్టరీగా నిలవనుంది. ఈనెల 14, 15 తేదీల్లో జరగనున్న CII సదస్సులో దీనికి భూమిపూజ చేయనున్నారు.
News November 2, 2025
రాజమండ్రిలోని NIRCAలో 27 ఉద్యోగాలు

రాజమండ్రిలోని ICAR- <


