News November 9, 2024
సచివాలయంలో 20 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహం

HYDలోని సచివాలయంలో 20 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. సచివాలయానికి వచ్చే ప్రతి ఒక్కరికి కనిపించేలా, ఎత్తైన పీఠం, దానిపై 20 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించనుంది. విగ్రహం ముందు గ్రీనరీ, భారీ ఫౌంటేన్, ఆకట్టుకునేలా లైటింగ్ వంటి సుందరీకరణ పనులు చేస్తున్నారు. డిసెంబర్ 9న విగ్రహావిష్కరణ చేయనుండటంతో చకచకా పనులు జరుగుతున్నాయి. సచివాలయ ప్రధాన ద్వారం ముందే విగ్రహాం ఏర్పాటవుతోంది.
Similar News
News February 11, 2026
ESIC హాస్పిటల్ భిలాయ్లో ఉద్యోగాలు

<
News February 11, 2026
పొలంలో ఎలుకల నిర్మూలనకు ముందు ఏం చేయాలి?

వ్యవసాయంలో వాతావరణ పరిస్థితులు, చీడపీడల తర్వాత ఎలుకలు చేసే నష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. పొలాల్లోని కలుగుల్లో ఉండే ఎలుకలను పొగబెట్టడం, రసాయన ఎరలు, ఎర స్థావరాల ఏర్పాటుతో నివారించవచ్చు. అయితే ఎలుక కన్నాల సంఖ్యను బట్టి నివారణా చర్యలు చేపట్టాలి. దీనికి ముందు పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. అలాగే పొలం గట్లమీద ఉండే పొదలను తొలగించాలి. గట్లను పారతో చెక్కి తర్వాత ఎలుకల నిర్మూలన చర్యలు చేపట్టాలి.
News February 11, 2026
వివాహ దోషాలకు పరిష్కారం స్వయంవర పార్వతీ మంత్రం

అన్ని అర్హతలున్నా పెళ్లి సంబంధాలు సెట్ కానప్పుడు స్వయంవర పార్వతీ మంత్రం పఠించాలని పండితులు చెబుతున్నారు. ‘శివుడిని భర్తగా పొందడానికి పార్వతీ దేవి ఈ మంత్రం జపించిందని పురాణాల వాక్కు. నిష్ఠతో ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపిస్తే జాతక దోషాలు హరిస్తాయి. అమ్మవారికి పసుపు, కుంకుమలతో పూజ చేస్తే కళ్యాణ యోగం వస్తుంది. ఈ సాధన మనసులో ధైర్యాన్ని నింపి త్వరగా పెళ్లి జరిగేలా చేస్తుంది’ అని సూచిస్తున్నారు.


