News November 9, 2024

తాడేపల్లిలో పెన్, పేపర్ల కోసం రూ.9.84 కోట్లు: లోకేశ్

image

AP: తాడేపల్లి ప్యాలెస్‌లో పెన్, పేపర్ల కోసం మాజీ సీఎం జగన్ రూ.9.84 కోట్లు ఖర్చు పెట్టారని మంత్రి నారా లోకేశ్ Xలో వెల్లడించారు. ఈ మొత్తాన్ని రాష్ట్రంలోని స్కూల్ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఉపయోగించవచ్చని పేర్కొన్నారు. ‘ఏపీ విద్యార్థులకు నాదొక ప్రశ్న.. మీ పెన్ ఖరీదు ఎంత? జగన్ ఏం రాసి ఉంటారని మీరు అనుకుంటున్నారు?’ అని ప్రశ్నించారు.

Similar News

News January 13, 2026

చర్మం పొడిబారి రాలుతోందా?

image

శీతాకాలం మొదలైతే చాలు చర్మం పొడిబారడం, ఎండిపోయి జీవం కోల్పోయినట్టుగా ఉండటం చాలామందిలో కనిపించే సమస్య. చర్మం బాగా పగిలిపోతే కలబంద రాయాలి. ఇది చర్మానికి చల్లదనం ఇవ్వడమే కాదు.. దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు దురద, నొప్పిని తగ్గిస్తాయి. ఆలివ్‌ నూనె సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. కొబ్బరి, జొజోబా నూనెలను సమపాళ్లలో తీసుకొని దానికి కొన్నిచుక్కల టీట్రీ ఆయిల్‌ కలిపి చర్మానికి రాయాలి.

News January 13, 2026

‘జిగురు అట్టల’తో రసంపీల్చే పురుగుల ఆటకట్టు

image

పంటలకు హానిచేసే రసం పీల్చే పురుగుల కట్టడిలో జిగురు అట్టలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ అట్టల ఉపరితలంపై జిగురు ఉంటుంది. వాటిపై వాలే పురుగులు జిగురుకు అంటుకుపోయి మరణిస్తాయి. పసుపు రంగు జిగురు అట్టలు తెల్లదోమ, పచ్చదోమ, వివిధ రకాల ఈగలను.. తెలుపు అట్టలు నల్ల తామర, ఎర్ర నల్లి, బ్లాక్‌ త్రిప్స్‌.. నీలిరంగు అట్టలు తామర పురుగులు, పేనుబంక, మిడతలను ఆకర్షిస్తాయి. ఈ అట్టలపై వాలగానే ఆ పురుగులు అతుక్కుని చనిపోతాయి.

News January 13, 2026

పిల్లలకు భోగి పళ్లు పోస్తున్నారా?

image

ఐదేళ్లలోపు చిన్నారులకు ప్రదోష వేళలో తూర్పు ముఖంగా కూర్చోబెట్టి భోగి పళ్లు పోయాలని పండితులు సూచిస్తున్నారు. తల్లి మొదట భోగి పళ్లతో బిడ్డకు 3 సార్లు సవ్యంగా, 3 సార్లు అపసవ్యంగా దిష్టి తీసి ఆపై తల మీద నుంచి పోయాలి. ఇలా చేస్తే నరదోషం తొలగిపోతుందని, నారాయణుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. చివరగా పిల్లలకు హారతివ్వాలి. భోగి పళ్లలో ఏమేం ఉండాలి? ఎందుకు పోయాలి? భోగి మంటల ఆవశ్యకత కోసం క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.