News November 9, 2024

 మిర్చి తోటకు దిష్టి తగలకుండా రైతు వినూత్న ఆలోచన

image

జూలూరుపాడు తాను సాగు చేస్తున్న మిర్చి తోటకు దిష్టి తగలకూడదని ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. కాకర్ల గురువాగుతూ క్రాస్ రోడ్డు వద్ద ఓ రైతు తన మిర్చి తోటలో ఓ సినీనటి బ్యానర్ ను ఏర్పాటు చేశాడు. ఇలా బ్యానర్ ఏర్పాటు చేయడం వల్ల మిర్చి తోటకు రోడ్డుపై వెళ్లే పలువురు దిష్టి తగలకుండా మంచిగా సాగు అవుతుందని ఆ రైతు అంటున్నాడు. 

Similar News

News January 2, 2026

స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి: మంత్రి

image

పెనుబల్లి మండలం గణేశ్ పాడు సమీపంలో స్కూల్ బస్సు బోల్తా ఘటనపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. ఘటనకు గల కారణాలపై జిల్లా కలెక్టర్ అనుదీప్‌తో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిమితికి మించి స్కూల్ బస్సులో విద్యార్థులను తీసుకెళ్లడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన స్కూల్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News January 2, 2026

స్కూల్ బస్సు బోల్తా ఘటనపై మంత్రి తుమ్మల ఆరా

image

వేంసూరు మండలం మొద్దులగూడెంలో వివేకానంద్ స్కూల్ వ్యాన్ పెనుబల్లి మండలం గణేశ్ పాడు వద్ద బోల్తాపడిన ఘటనపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరాతీశారు. సంబంధిత శాఖలను అప్రమత్తం చేయడంతో పాటు మంత్రి కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్‌లతో మాట్లాడారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సేవలు అందేలా సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News January 2, 2026

అవసరానికి మించి యూరియా కొనుగోలు చేయవద్దు: జిల్లా కలెక్టర్

image

రైతులు ఎవరు ప్రస్తుత అవసరానికి మించి యూరియా కొనుగోలు చేయవద్దని రైతులకు జిల్లా కలెక్టర్ అనుదీప్ సూచించారు. భవిష్యత్తులో యూరియా దొరుకుతుందో లేదో అనే అనుమానంతో ప్రస్తుతం అధికంగా కొనుగోలు చేసి స్టోర్ చేసుకుంటే యూరియా యొక్క నాణ్యత దెబ్బ తిని పంట నష్టం వచ్చే అవకాశం ఉందని చెప్పారు. యూరియా కోసం రైతులు ఏ సమయంలో రావాలో వారికి ముందస్తుగానే సమాచారం అందిస్తూ కూపన్లు కూడా జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.