News November 9, 2024

28వ బిలియర్డ్స్ టైటిల్ గెలుచుకున్న పంకజ్ అద్వానీ

image

భారత బిలియర్డ్స్ ఆటగాడు పంకజ్ అద్వానీ రికార్డు స్థాయిలో 28వసారి బిలియర్డ్స్ టైటిల్ గెలుచుకున్నారు. దోహాలో జరిగిన IBSF ఛాంపియన్‌షిప్‌లో ఇంగ్లండ్‌కు చెందిన రాబర్ట్ హాల్‌ను 4-2 తేడాతో ఓడించారు. ఈ టైటిల్‌ను ఆయన వరుసగా ఏడోసారి గెలుచుకోవడం విశేషం. 2016లో అద్వానీ విజయ పరంపర మొదలైంది.

Similar News

News September 15, 2025

24 గంటల్లో 3 మ్యాచులు ఆడిన ప్రొటీస్ క్రికెటర్

image

దక్షిణాఫ్రికా క్రికెటర్ జోర్న్ ఫార్టూయిన్ ఓ అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నారు. 24 గంటల వ్యవధిలోనే మూడు T20 మ్యాచులు ఆడి అందరినీ ఆశ్చర్యపరిచారు. SEP 12న రా.6.30 గంటలకు మాంచెస్టర్‌లో ఇంగ్లండ్‌తో T20 మ్యాచ్ ఆడారు. 13న మ.2.30 గంటలకు బర్మింగ్‌హామ్‌లో జరిగిన T20 బ్లాస్ట్ సెమీఫైనల్‌లో హ్యాంప్‌షైర్ తరఫున పాల్గొన్నారు. హ్యాంప్‌షైర్ ఫైనల్‌కు దూసుకెళ్లడంతో ఆ వెంటనే రా.6.45 గంటలకు ఆ మ్యాచ్ కూడా ఆడేశారు.

News September 15, 2025

సమ్మె విరమించమని కోరాం: భట్టి

image

TG: ప్రైవేటు కళాశాలలు <<17708995>>బందు<<>>కు పిలుపునిచ్చిన నేపథ్యంలో యాజమాన్యాలతో Dy.CM భట్టి విక్రమార్క అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. ‘చర్చలు సానుకూలంగా సాగాయి. సమస్యలు అర్థం చేసుకున్నాం. సోమవారం ప్రభుత్వ పరంగా ఓ నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకు సమ్మె విరమించాలని కోరాం. వారు సానుకూలంగా స్పందించారు’ అని తెలిపారు. బంద్ నిర్ణయంలో కళాశాలలు వెనక్కి తగ్గట్లేదని తెలుస్తోంది. ఇవాళ మ.3 గం.కు మరోసారి చర్చలు జరగనున్నాయి.

News September 15, 2025

ఇలాంటి మెసేజ్ మీకూ వచ్చిందా?

image

సైబర్ మోసగాళ్లు రోజుకో కొత్త మార్గంలో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ‘ఇండియా పోస్ట్’ పేరిట ఫేక్ మెసేజులు పంపుతున్నారు. ‘మీ పార్సిల్ వేర్ హౌస్‌కి చేరుకుంది. అడ్రస్ సరిగ్గా లేకపోవడంతో డెలివరీ కుదర్లేదు. ఈ లింక్ ఓపెన్ చేసి 48 గంటల్లోగా అడ్రస్ అప్‌డేట్ చేయండి. లేదంటే పార్సిల్ రిటన్ వెళ్లిపోతుంది’ అని మెసేజ్‌లు పంపుతున్నారు. అవన్నీ ఫేక్ అని PIB FACT CHECK తేల్చింది. మీ వాళ్లకి ఈ విషయం షేర్ చేయండి.