News November 10, 2024
రైతులకు డ్రోన్లు అందిస్తాం: అచ్చెన్నాయుడు

AP: ఆసక్తి ఉన్న రైతులకు డ్రోన్లు అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో వ్యవసాయానికి 40వేల డ్రోన్లు అవసరం ఉందని ఆయన చెప్పారు. దీంతో పాటు ఎరువులను ద్రవరూపంలోకి మార్చాలని ఆలోచిస్తున్నామని తెలిపారు. ఉద్యానవన పంటలతో రైతులకు లాభమని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారని, దానికి పూర్వవైభవం తీసుకొస్తామని కిసాన్ మేళాలో చెప్పారు.
Similar News
News November 3, 2025
చెదిరిన కలలు, చెరిగిన జీవితాలు

21మంది చనిపోయిన మీర్జాగూడ రోడ్డు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. కాలేజీకి వెళ్తున్న స్టూడెంట్స్, ఉపాధి కోసం బయల్దేరిన కూలీలు, ఆస్పత్రిలో చికిత్స కోసం బస్సెక్కిన ఫ్యామిలీ, రైలు మిస్ కావడంతో బస్ అందుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ఇలా ప్రతి ఒక్కరిదీ ఒక్కో కథ, కల. కానీ అవన్నీ ఒక్క ప్రమాదంతో కల్లలయ్యాయి. కంకర టిప్పర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు అందరి జీవితాలకు రాళ్ల సమాధి కట్టింది.
News November 3, 2025
సుప్రీం కోర్టుకు రాష్ట్రాల CSలు క్షమాపణలు

వీధికుక్కల వ్యవహారంలో AP సహా పలు రాష్ట్రాల CSలు సుప్రీంకోర్టు ముందు హాజరయ్యారు. అఫిడవిట్ల దాఖలు ఆలస్యానికి వారు క్షమాపణలు చెప్పారని సొలిసిటర్ జనరల్ కోర్టుకు నివేదించారు. తాము Oct 29నే అఫిడవిట్ ఇచ్చామని AP CS తెలిపారు. రాష్ట్రాల అఫిడవిట్ల ఆధారంగా స్ట్రే డాగ్స్ కోసం ఛార్ట్ రూపొందించాలని అమికస్ క్యూరీకి SC సూచించింది. కాగా కేసులో కుక్కకాటు బాధితులను ప్రతివాదులుగా చేర్చేందుకు కోర్టు అంగీకరించింది.
News November 3, 2025
శుభ కార్యాలు నిర్విఘ్నంగా జరగాలంటే..

యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యా పరశ్శతమ్|
విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే||
‘విష్ణు సేనాధిపతి విష్వక్సేనుడికి గణపతి సహా 100+ పరివార దేవతలున్నారు. ఆ పరివారంతో కలిసి ఆయన భక్తుల ఆటంకాలను, విఘ్నాలను నిత్యం తొలగిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ విఘ్న నివారకుడైన విష్వక్సేనుడిని నేను ఆశ్రయిస్తున్నాను’ అని దీనర్థం. శుభకార్యాలు నిర్విఘ్నంగా జరగడానికి విష్వక్సేనుడిని పూజించాలని శాస్త్రవచనం. <<-se>>#NAMAMSARAM<<>>


