News November 10, 2024
వైట్హౌస్కు దూరంగా ట్రంప్ కుమార్తె, అల్లుడు!

అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న బాధ్యతలు చేపట్టనున్నారు. ఈనేపథ్యంలోనే ఆయన కూతురు ఇవాంక, అల్లుడు జారెడ్ కుష్నర్ గురించి చర్చ మొదలైంది. గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా పని చేసినప్పుడు ఇవాంక, కుష్నర్ వైట్హౌస్లో పని చేశారు. అయితే ఈసారి మాత్రం వాళ్లు అడ్మినిస్ట్రేషన్లో పాలుపంచుకునేలా కనిపించడం లేదు. వాళ్లిద్దరూ ట్రంప్ రాజకీయ ప్రచారాల్లోనూ పాల్గొనలేదు.
Similar News
News July 7, 2025
ICC CEOగా సంజోగ్ గుప్తా

ICC CEOగా భారత్కు చెందిన సంజోగ్ గుప్తా నియమితులయ్యారు. ఇవాళ్టి నుంచి ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ICC ప్రకటించింది. సంజోగ్ ప్రస్తుతం జియోస్టార్లో స్పోర్ట్స్, లైవ్ ఎక్స్పీరియన్స్ CEOగా ఉన్నారు. ఢిల్లీ వర్సిటీ నుంచి ఎకనామిక్స్లో B.A పట్టా పొందిన ఆయన జర్నలిస్టుగా కెరీర్ను ప్రారంభించారు. టీవీ నెట్వర్క్లో క్రమంగా ఎదుగుతూ వచ్చారు. ఇప్పుడు ICC CEO పదవి చేపట్టిన ఏడో వ్యక్తిగా నిలిచారు.
News July 7, 2025
జగన్ పర్యటనకు పోలీసుల అనుమతి

AP: వైసీపీ అధినేత జగన్ ఎల్లుండి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. మామిడి రైతులను పరామర్శించే మార్కెట్ యార్డు చిన్నది కావడంతో జగన్తో పాటు 500 మంది మాత్రమే ఉండాలని ఆంక్షలు విధించారు. పర్యటనలో ఎలాంటి ర్యాలీలు, రోడ్షోలు చేయకూడదని నిబంధన పెట్టారు. గత పర్యటనల్లో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు జాగ్రత్తలు పాటిస్తున్నారు.
News July 7, 2025
కొత్త దందా.. విచ్చలవిడిగా వయాగ్రా, అబార్షన్ ట్యాబ్లెట్ల అమ్మకాలు!

AP: ఉభయ గోదావరి జిల్లాల్లోని మెడికల్ షాపుల్లో కొత్త దందా తెరపైకి వచ్చింది. అనుమతి లేకుండా అబార్షన్లు, అడ్డగోలుగా వయాగ్రా ట్యాబ్లెట్లు అమ్ముతున్నారని తెలుస్తోంది. టార్గెట్ల పేర్లతో ఇష్టారీతిన అమ్మకాలు జరుపుతున్నట్లు సమాచారం. తాజాగా అధికారులు మెడికల్ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. అయితే ఈ ట్యాబ్లెట్లు వాడేందుకు అనుమతి ఉండాలని, ఎక్కువగా వాడితే అనారోగ్యానికి దారి తీస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.