News November 10, 2024

ఆ బోర్డు నాలుగు అక్షరాల క్రూరత్వం: కేంద్రమంత్రి

image

వక్ఫ్ బోర్డుపై కేంద్ర మంత్రి సురేశ్ గోపి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘అది ఒక నాలుగు ఆంగ్ల అక్షరాల ‘క్రూరత్వం” అని అన్నారు. కేరళలోని మునంబామ్‌లో క్రిస్టియన్లకు చెందిన 400 ఎకరాలు తమకు చెందుతాయని వక్ఫ్ బోర్డు అనడాన్ని తప్పుబట్టారు. త్వరలో వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదిస్తుందని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మండిపడింది. ప్రజలను విభజించి పాలించే ప్రకటనలు మానుకోవాలంది.

Similar News

News February 16, 2026

ఎమోషన్స్‌ను బయటపెట్టాల్సిందే..

image

ప్రతిమనిషికీ భావోద్వేగాలు ఉంటాయి. పరిస్థితులను బట్టి అవి బయటకు వస్తాయి. కానీ కొందరు కోపం, భయం, బాధ వస్తే లోలోపలే తొక్కిపెట్టేస్తుంటారు. అవి తలనొప్పి, కడుపు సమస్యలు, గుండెదడ, నిద్రలేమి, అజీర్తి వంటి శారీరక సమస్యల రూపంలో అవి బయటకు వస్తాయంటున్నారు సైకాలజిస్ట్ విశేష్. కాబట్టి ప్రతిఒక్కరూ తమలోని ఎమోషన్స్‌ని సన్నిహితులతో పంచుకోవాలని సూచిస్తున్నారు. కుదరకపోతే సైకాలజిస్ట్ సాయం తీసుకోవాలని చెబుతున్నారు.

News February 16, 2026

విజయ్- రష్మిక పెళ్లికార్డు వైరల్!

image

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక వివాహం ఈనెల 26న జరగనున్నట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రిక ఒకటి వైరలవుతోంది. మార్చి 4న 7PMకి హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో రిసెప్షన్ జరగనుందని అందులో పేర్కొన్నారు. పెళ్లిని బంధువుల సమక్షంలో చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిపై VD టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

News February 16, 2026

టెక్నాలజీతో పౌర సేవకు బిల్‌గేట్సే ప్రేరణ: సీఎం

image

AP: రాష్ట్రంలోని ప్రజల జీవితాలను రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్(RTGS) మారుస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. టెక్నాలజీ మానవాళికి ఉపయోగపడాలన్నారు. 1990లలో బిల్‌గేట్స్‌తో మీటింగ్ తర్వాత సాంకేతికత ద్వారా పౌర సేవకు ప్రేరణ కలిగిందని Xలో గుర్తు చేసుకున్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయంతో సహా అనేక కార్యక్రమాలతోపాటు యంగ్ మైండ్స్‌తో నిండిఉన్న RTGS కేంద్రాన్ని బిల్ గేట్స్ సందర్శించడం సంతోషంగా ఉందని చెప్పారు.