News November 10, 2024
MBNR: కులగణన.. వివరాల సేకరణలో 4,740 టీచర్లు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే(కులగణన) కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లాల్లో 2,041కు పైగా ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న MBNR-1,156, NGKL-1,450, GDWL-606, NRPT-746, WNPT-782 మంది ఉపాధ్యాయులను అధికారులు సర్వేకు కేటాయించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఒంటి పూటే కొనసాగగా.. మధ్యాహ్నం నుంచి ఉపాధ్యాయులు సర్వేకు వెళుతున్నారు.
Similar News
News January 20, 2026
జిల్లాలో చలి పంజా.. రాజాపూర్లో 11.8 డిగ్రీలు

ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో రాజాపూర్ మండలంలో అత్యల్పంగా 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జడ్చర్లలో 12.1, కొత్తపల్లిలో 13.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెరిగిన చలితో రాత్రివేళల్లో జనం ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
News January 19, 2026
మన్యంకొండ ఆలయ హుండీ ఆదాయం రూ.35.77 లక్షలు

మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం నిర్వహించిన హుండీ లెక్కింపులో రూ.35,77,912 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మధుసూదన్ కుమార్, ఈవో శ్రీనివాసరాజు, గ్రంథాలయ ఛైర్మన్ మల్లు నరసింహారెడ్డి, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
News January 19, 2026
మహబూబ్నగర్: టీచర్ల కాంప్లెక్స్ సమావేశాలు వాయిదా

రిపబ్లిక్ డే ఏర్పాట్ల నేపథ్యంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను వాయిదా వేయాలని డీఈఓ కార్యాలయ ఏడీ అనురాధకు టీఎస్యూటీఎఫ్ (TSUTF) నాయకులు వినతిపత్రం ఇచ్చారు. దీనికి సానుకూలంగా స్పందించిన అధికారులు, వేడుకల అనంతరం సమావేశాలు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం పట్ల యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవికుమార్, వెంకటేశ్ కృతజ్ఞతలు తెలిపారు.


