News November 10, 2024

రాజస్థాన్‌లో కాలేజీలకు కాషాయ రంగులు.. కాంగ్రెస్ విమర్శలు

image

కాలేజీలకు కాషాయ రంగులు వేయాలన్న రాజస్థాన్ ప్రభుత్వ ఆదేశాలు ప్రతిపక్షాల ఆగ్రహానికి దారితీశాయి. కాయకల్ప్ పథకం ద్వారా శాంతియుత వాతావరణం సృష్టించేందుకు పైలెట్ ప్రాజెక్టుగా 20 కాలేజీలకు కాషాయ రంగులు వేయాలని విద్యాశాఖ ఆదేశించింది. అయితే విద్యను కాషాయీకరణ చేస్తున్నారని కాంగ్రెస్ మండిపడింది. విద్యా వ్యవస్థల్లో ఉన్న సమస్యలు వదిలేసి రాజకీయాల కోసం ప్రజల డబ్బులు వెచ్చిస్తారా అని విమర్శించింది.

Similar News

News April 15, 2026

గుర్తుపెట్టుకోండి.. ‘అతి వినయం ధూర్త లక్షణం’

image

సహజ విరుద్ధంగా ఎవరి పట్లయినా అధిక వినయం, గౌరవాన్ని ప్రదర్శించేవారిని ప్రస్తావించేటప్పుడు ఈ సూక్తిని వాడతాం. పంచతంత్ర కథలు, చాణక్య నీతి కథల నుంచి ఇది వచ్చింది. వినయంగా ఉండటం మంచిదే. కానీ దాన్ని అతిగా ప్రదర్శిస్తున్నారంటే నమ్మక ద్రోహానికి సంకేతం కావొచ్చు. తమ పనులు సాధించుకోవడానికి మోసగాళ్లు, స్వార్థపరులు ఇలా చేస్తారు. మీ జీవితంలో ఇలాంటి వ్యక్తులు ఎదురయ్యారా? కామెంట్ చేయండి.
<<-se>>#EPICSAYINGS<<>>

News April 15, 2026

‘AMARAVATHI’ కాదు ‘AMARAVATI’

image

AP: రాజధాని అమరావతి పేరును ఆంగ్లంలో తప్పుడు స్పెల్లింగ్‌ వినియోగించరాదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఎలా వాడాలో సూచిస్తూ CS సర్క్యులర్ జారీచేశారు. 2015లో ప్రభుత్వం రాష్ట్ర రాజధానిగా ‘AMARAVATI’ని ప్రకటించిందని పేర్కొన్నారు. అయితే కలెక్టర్లు, ఇతర అధికారులు నివేదికల్లో అమరావతిని ఇంగ్లిష్‌లో ‘AMARAVATHI’ అని రాస్తున్నారని పేర్కొంది. ఇకపై ‘AMARAVATI’ అని మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు.

News April 15, 2026

అమ్మాయిలకు మీసాలు.. కారణమిదే

image

కొంతమంది అమ్మాయిలకు అబ్బాయిల్లా మీసాలు, గడ్డాలు రావడంతో పాటు ముఖంపై ఎక్కువగా వెంట్రుకలు ఉంటాయి. ఈ సమస్యను హిర్సుటిజం(Hirsutism) అంటారు. ఈ సమస్య PCOD, థైరాయిడ్ ఉన్నవారిలో కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. మహిళల్లో చాలా తక్కువ మోతాదులో ఉండే మేల్ హార్మోన్స్ పెరగడం, కొన్నిరకాల మందులు వాడటం వల్ల కూడా ముఖంపై వెంట్రుకలు వస్తాయి. సమస్యను గుర్తించగానే వైద్యులను సంప్రదించడం మంచిది.