News November 11, 2024
మెదక్: దహన సంస్కారాలలో అడుక్కోడానికి స్కానర్

డిజిటల్ వినియోగం పెరిగిపోయిన నేపథ్యంలో దహన సంస్కారాల సమయంలో అడుక్కోవడానికి స్కానర్ ఉపయోగించడం ఆశ్చర్యానికి గురిచేసింది. మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాల్ పల్లి గ్రామానికి చెందిన బాలమణి నిన్న మృతిచెందగా ఈరోజు దహన సంస్కారం నిర్వహించారు. దహన సంస్కారాల వద్ద అడుక్కోవడానికి వచ్చిన కాటిపాపల మహేశ్ ఏకంగా షర్టుకు ఫోన్ పే స్కానర్ తగిలించి అడుక్కోవడం వింతగా చూశారు.
Similar News
News January 23, 2026
మెదక్: 25న 16వ జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలు

ఈ నెల 25న 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో ఓటరు దినోత్సవ వేడుకలను అన్ని శాఖల సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ నగేశ్ ఆదేశించారు.
కలెక్టరేట్ కార్యాలయంలో ఓటర్ అవగాహన ర్యాలీపై అధికారులతో సమీక్షించారు. నా భారత్ – నా ఓటు అనే నినాదంతో అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా వివిధ రకాల కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్య పరచాలన్నారు.
News January 23, 2026
MDK: ‘ఆపరేషన్ స్మైల్’.. 49 మంది చిన్నారులకు విముక్తి

మెదక్ జిల్లాలో ‘ఆపరేషన్ స్మైల్’ ద్వారా ఇప్పటివరకు 49 మంది బాలకార్మికులను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించినట్లు అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. మరో 12 మంది పిల్లలను సంరక్షణ కేంద్రాలకు తరలించామని, ఈ విషయంలో జిల్లావ్యాప్తంగా 41 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. పనిలో చేరిన నలుగురు పిల్లలను తిరిగి బడిలో చేర్పించామని, బాల్యానికి అండగా నిలుస్తామని డీపీఓ అధికారుల సమావేశంలో ఆయన స్పష్టం చేశారు.
News January 23, 2026
MDK: ‘ఆపరేషన్ స్మైల్’.. 49 మంది చిన్నారులకు విముక్తి

మెదక్ జిల్లాలో ‘ఆపరేషన్ స్మైల్’ ద్వారా ఇప్పటివరకు 49 మంది బాలకార్మికులను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించినట్లు అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. మరో 12 మంది పిల్లలను సంరక్షణ కేంద్రాలకు తరలించామని, ఈ విషయంలో జిల్లావ్యాప్తంగా 41 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. పనిలో చేరిన నలుగురు పిల్లలను తిరిగి బడిలో చేర్పించామని, బాల్యానికి అండగా నిలుస్తామని డీపీఓ అధికారుల సమావేశంలో ఆయన స్పష్టం చేశారు.


