News November 11, 2024

నిజాంసాగర్: చేపలు పట్టడానికి వెళ్లి విద్యార్థి మృతి

image

నిజాంసాగర్ మండలంలోని కోమలంచ గ్రామానికి చెందిన శివానంద్ మంజీరా నదిలో చేపలు పట్టడానికి వెళ్లి ఈతడానికి రాక ప్రమాదవశాత్తు పడి ఆదివారం మృతి చెందారు. విద్యార్థి శివానంద్ బాన్సువాడ ఠాగూర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఘటనకు సంబంధించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 15, 2026

NZB: మున్సిపల్ రిజర్వేషన్లు ఇలా..

image

నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. నిజామాబాద్ కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉండగా STకి ఒకే ఒక్క స్థానం దక్కింది.
1.నిజామాబాద్ కార్పొరేషన్‌- ST(G)-1, SC(G)-3, W-2, BC(G)-12, W-12 UR(G)-14, W-16
2.బోధన్- ST(G)-1, SC(G)-2, W-1 BC(G)-8, W-7 UR(G)8-, W-11
3.ఆర్మూర్- ST(G)-1, SC(G)-2 W-1, BC(G)-7, W-7 UR(G)-8, W-10
4.బీమ్‌గల్- ST(G)-1, SC(G)-1 W-1, BC(G)-2, W-1 UR(G)-2, W-4

News January 14, 2026

NZB: మత్తు మందు ఇచ్చి దొంగతనం.. ముఠా అరెస్ట్

image

వ్యాపారం పేరిట మాయమాటలు చెప్పి, మత్తు మందు కలిపిన బీరు ఇచ్చి నగలు దొంగిలించిన ముఠాను నిజామాబాద్ టౌన్-4 పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడు శ్రీనివాస్ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రసాద్, నర్సింగరావు, రుద్రా యాదవ్ అనే ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి నగదు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, ఏపీల్లో వీరు పలు నేరాలకు పాల్పడినట్లు ఎస్హెచ్ఓ సతీశ్ కుమార్ తెలిపారు.

News January 14, 2026

నిజామాబాద్: ఆర్టీసీ స్పెషల్ వసూళ్లు !

image

సంక్రాంతి నేపథ్యంలో నిజామాబాద్ రీజియన్‌లోని ఆరు డిపోల నుంచి వివిధ రూట్లల్లో 500 స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసింది. దూర ప్రాంతాలకు బస్సులు నడుపుతుండగా గ్రామీణా ప్రాంతాలకు వెళ్లే బస్సులు తగ్గడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వగ్రామాలకు వెళ్లేవారి నుంచి స్పెషల్ పేరిట అదనంగా 50 శాతం పసూళ్లు చేస్తోందని, పండగపూట ఆర్టీసీ ప్రయాణికుల జేబులు ఖాళీ చేస్తోందని తీవ్ర విమర్శలు వస్తున్నాయి.