News November 11, 2024

శాసనసభ ప్రాంగణంలో పరిటాల సునీత, బండారు శ్రావణి

image

రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీ సమావేశాలకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి హాజరయ్యారు. మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం శాసనసభ వాయిదా పడింది. సభ నుంచి బయటకు వస్తున్న సమయంలో వారు శాసనసభ ప్రాంగణంలో సహచర మహిళా ఎమ్మెల్యేలతో కాసేపు ముచ్చటించారు. అనంతరం ఫొటోలకు పోజులిచ్చారు.

Similar News

News April 17, 2026

పరిశ్రమలకు అనుమతులు వెంటనే ఇవ్వాలి: కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులకు సూచించారు. సింగిల్ డెస్క్ విధానం ద్వారా పారిశ్రామికవేత్తలకు అనుకూల వాతావరణం కల్పించాలని తెలిపారు. పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించి, కొత్త పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సబ్సిడీలు ఇచ్చి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు.

News April 17, 2026

జర్నలిస్టులు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి: కలెక్టర్ ఆనంద్

image

జర్నలిస్టులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. వర్కింగ్ జర్నలిస్టుల ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పని ఒత్తిడిలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని కోరారు. ఇటీవల మరణించిన జర్నలిస్టులు కాలువ రమణ, రవికుమార్ కుటుంబాలకు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా యంత్రాంగం ఎప్పుడూ జర్నలిస్టులకు అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

News April 17, 2026

జర్నలిస్టులు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి: కలెక్టర్ ఆనంద్

image

జర్నలిస్టులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. వర్కింగ్ జర్నలిస్టుల ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పని ఒత్తిడిలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని కోరారు. ఇటీవల మరణించిన జర్నలిస్టులు కాలువ రమణ, రవికుమార్ కుటుంబాలకు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా యంత్రాంగం ఎప్పుడూ జర్నలిస్టులకు అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.