News November 11, 2024

జిల్లాలో తొలి బయోమైనింగ్ కేంద్రం ప్రారంభం

image

ఇల్లెందు మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన బయోమైనింగ్ కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే కనకయ్య, మున్సిపల్ ఛైర్మన్ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. జిల్లాలోనే తొలి బయో మైనింగ్ కేంద్రం ఇల్లెందులో ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్లో డంపింగ్ చేసి గుట్టల గుట్టలుగా పెరిగిపోయిన చెత్తను రీసైక్లింగ్ చేసి కాలుష్యం కాకుండా పర్యావరణాన్ని కాపాడేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు.

Similar News

News February 5, 2026

ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు

image

ఖమ్మం (D)లో క్యాన్సర్ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. జిల్లాలో ప్రస్తుతం 1,883 యాక్టివ్ కేసులు ఉండగా, బాధితుల్లో మహిళలే 1,418 మంది ఉన్నారు. ముఖ్యంగా రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. జిల్లాలోని 31 PHC, 7CHCలతో పాటు ప్రభుత్వాసుపత్రిలో రోగులను గుర్తించి చికిత్స అందిస్తున్నారు. ఆహార అలవాట్లు, జీవనశైలిలో మార్పుల ద్వారా ఈ మహమ్మారిని నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

News February 5, 2026

నిధుల బకాయిల ఉచ్చులో ఖమ్మం పెద్దాసుపత్రి

image

ఖమ్మం పెద్దాసుపత్రికి ఏడాదిన్నరగా ఆరోగ్యశ్రీ నిధులు రాకపోవడంతో వైద్య సేవలకు ఆటంకం కలుగుతోంది. ఆర్థో విభాగానికి రావాల్సిన రూ.60 లక్షల బకాయిల వల్ల మోకాళ్ల ఆపరేషన్లు నిలిచిపోయాయి. క్యాత్ ల్యాబ్ పరికరాల కొనుగోలుకు నిధుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. నిధుల కొరతతో అభివృద్ధి పనులు కుంటుపడటమే కాకుండా, రోగులకు సరైన చికిత్స అందడం లేదని, ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు.

News February 5, 2026

ఖమ్మం RTA ఆఫీసులో నకిలీ ఆధార్ కార్డుల మాఫియా

image

KMM జిల్లా RTA కార్యాలయం సమీపంలోని ఏజెంట్ షాపుల కేంద్రంగా నకిలీ ఆధార్ కార్డుల దందా సాగుతోంది. కొంతమంది కార్యాలయ సిబ్బంది సహకారంతో దళారులు ఫోర్జరీ పత్రాలను సృష్టించి, ఫైనాన్స్ కట్టని వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇలా అక్రమ మార్గంలో భారీగా సొమ్ము వసూలు చేస్తున్నారని సమాచారం. కీలకమైన ఆధార్ కార్డునే నకిలీగా మారుస్తున్న ఈ మాఫియాపై చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.