News November 12, 2024
అభ్యర్థుల మార్కుల వెల్లడి గోప్యత ఉల్లంఘన కాదు: కోర్టు

రిక్రూట్మెంట్లో అభ్యర్థులకు వచ్చిన మార్కుల్ని వెల్లడించడం గోప్యత ఉల్లంఘన కాదని బాంబే హైకోర్టు పేర్కొంది. పుణే కోర్టులో ఉద్యోగానికి పరీక్షలు రాసిన ఓంకార్ అనే వ్యక్తి ఇంటర్వ్యూకు ఎంపిక కాకపోవడంతో అభ్యర్థులందరి మార్కుల వివరాల కోసం RTI దరఖాస్తు చేశారు. అది గోప్యత ఉల్లంఘన అవుతుందంటూ అతడి దరఖాస్తును RTI కమిషనర్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ఓంకార్ హైకోర్టును ఆశ్రయించగా బెంచ్ తాజా తీర్పునిచ్చింది.
Similar News
News December 31, 2025
‘ధురంధర్’పై బ్యాన్.. రూ.90 కోట్లు లాస్: డిస్ట్రిబ్యూటర్

రణ్వీర్ సింగ్ లీడ్ రోల్లో ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్’ ఈ ఏడాదిలోనే అత్యధిక వసూళ్లు(రూ.1100+కోట్లు) రాబట్టిన చిత్రంగా నిలిచింది. అయితే ఈ సినిమాకు మిడిల్ ఈస్ట్ దేశాల్లో రూ.90 కోట్లు లాస్ అయ్యామని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ వెల్లడించారు. సౌదీ అరేబియా, UAE, బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతర్ దేశాలు మూవీని బ్యాన్ చేయడమే కారణమని పేర్కొన్నారు. PAKకు వ్యతిరేకంగా ఉండటంతో ఈ సినిమాను ఆ దేశాలు నిషేధించాయి.
News December 31, 2025
25,487 ఉద్యోగాలు.. నేడే లాస్ట్

కేంద్ర బలగాల్లో 25,487 కానిస్టేబుల్ పోస్టులకు అప్లికేషన్ గడువు నేటితో ముగియనుంది. తెలంగాణలో 494, ఏపీలో 611 ఖాళీలున్నాయి. టెన్త్ పాసై, 18-23సం.ల మధ్య వయస్సు గల వారు అప్లై చేసుకోవచ్చు. సీబీటీ, PST/PET, వైద్య పరీక్షలు, DV ద్వారా ఎంపిక చేస్తారు. వచ్చే ఏడాది FEB-ఏప్రిల్లో CBT ఉంటుంది. కాగా దరఖాస్తు గడువు పొడిగించబోమని ఇప్పటికే SSC స్పష్టం చేసింది.
వెబ్సైట్: ssc.gov.in
News December 31, 2025
2025: తెలుగు రాష్ట్రాల్లో వెలుగులు

2025లో AP, TGలు కీలక సంఘటనలకు వేదికలయ్యాయి.
• మే 2: అమరావతి పునర్నిర్మాణానికి PM మోదీ శంకుస్థాపన
• మే 31: Hydలో మిస్ వరల్డ్ పోటీలు.. థాయిలాండ్ సుందరి విజేత
• జూన్ 21: విశాఖలో 3 లక్షల మందితో యోగా దినోత్సవం
• ఆగస్టు 15: APలో మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం ప్రారంభం
• అక్టోబర్ 14: విశాఖలో గూగుల్ రూ.1.35 లక్షల కోట్ల డేటా సెంటర్ ప్రకటన
• డిసెంబర్ 13: హైదరాబాద్లో మెస్సీ సందడి


