News November 12, 2024

STOCK MARKETS: రియాల్టి షేర్ల జోరు

image

దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు తీవ్ర ఆటుపోట్లకు లోనవుతున్నాయి. క్షణాల్లోనే పెరుగుతూ తగ్గుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సిగ్నల్స్ రావడం, CPI డేటా రావాల్సి ఉండటమే ఇందుకు కారణాలు. సూచీల గమనం తెలియకపోవడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సెన్సెక్స్ 79,582 (+86), నిఫ్టీ 24,166 (+25) వద్ద ట్రేడవుతున్నాయి. రియాల్టి, ఐటీ, మీడియా, హెల్త్‌కేర్ షేర్లు పెరిగాయి. ఆటో, FMCG సూచీలు తగ్గాయి.

Similar News

News July 8, 2025

రెండు రోజులు భారీ వర్షాలు: వాతావరణ కేంద్రం

image

TG: ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రానికి రెండు రోజులు వర్ష సూచన ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ జారీచేసింది. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. జగిత్యాల, సిరిసిల్ల, KNR, పెద్దపల్లి, BHPL, మెదక్‌, కామారెడ్డిలో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. గంటకు 40-50km వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

News July 8, 2025

జనగణన.. పౌరులే వివరాలు సమర్పించే అవకాశం

image

దేశ వ్యాప్తంగా చేపట్టే జన, కులగణనలో పౌరులే నేరుగా తమ వివరాలు సమర్పించే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా కల్పించనుంది. ఇందుకోసం త్వరలోనే ఓ వెబ్‌సైటును అందుబాటులోకి తీసుకురానుంది. తొలుత 2026 ఏప్రిల్ 1న ఇళ్ల వివరాలతో కూడిన జాబితా, ఆ తర్వాత 2027 ఫిబ్రవరి 1 నుంచి జనగణనను ఎన్యుమరేటర్లు నమోదు చేస్తారు. ఇదే సమయంలో కులగణననూ చేపడతారు. ఈ రెండు విడతల్లోనూ ప్రజలు తమ వివరాలు పోర్టల్‌లో నమోదు చేయవచ్చు.

News July 8, 2025

నన్ను కూడా చంపేవారు: నల్లపురెడ్డి

image

AP: నెల్లూరు సుజాతమ్మ కాలనీలోని తన ఇంటిపై జరిగిన దాడి <<16984961>>ఘటనపై <<>>వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి స్పందించారు. ‘నెల్లూరు జిల్లాలో దాడి సంస్కృతి ఎప్పుడూ లేదు. వేమిరెడ్డి దంపతులు ఇలాంటి రాజకీయం చేస్తారని అనుకోలేదు. నేను, నా కొడుకు బయటకెళ్లాక దాడి చేశారు. ఇంట్లో వస్తువులన్నీ ధ్వంసం చేశారు. దాడి సమయంలో ఇంట్లో ఉన్న మా అమ్మను బెదిరించారు. ఇంట్లో ఉంటే నన్ను కూడా చంపేవారు’ అని ఆరోపించారు.