News November 12, 2024

రఘురామ పిటిషన్లపై విచారణ మరో ధర్మాసనానికి బదిలీ

image

YS జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనం మరో బెంచ్‌కు బదిలీ చేసింది. జస్టిస్ సంజయ్ కుమార్ లేని ధర్మాసనం విచారిస్తుందని తెలిపింది. మరోవైపు ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు తమకు మరింత సమయం కావాలని సీబీఐ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. అక్రమాస్తుల కేసు విచారణను HYD నుంచి మరో రాష్ట్రానికి మార్చాలని, జగన్ బెయిల్ రద్దు చేయాలని RRR వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.

Similar News

News November 18, 2025

పిస్తా హౌస్, షా గౌస్, Mehfil హోటళ్లలో ఐటీ సోదాలు

image

TG: హైదరాబాద్‌లోని ప్రముఖ హోటళ్లైన పిస్తా హౌస్, షా గౌస్, Mehfil ఛైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో ఆదాయపు పన్ను అధికారులు సోదాలు చేపట్టారు. మొత్తం 50 టీమ్స్‌తో 15 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. ఈ రెండు హోటళ్లు ఏటా రూ.వందల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. HYD, దుబాయ్‌తో పాటు ఇతర నగరాల్లోనూ బ్రాంచులు ఉన్నాయి.

News November 18, 2025

పిస్తా హౌస్, షా గౌస్, Mehfil హోటళ్లలో ఐటీ సోదాలు

image

TG: హైదరాబాద్‌లోని ప్రముఖ హోటళ్లైన పిస్తా హౌస్, షా గౌస్, Mehfil ఛైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో ఆదాయపు పన్ను అధికారులు సోదాలు చేపట్టారు. మొత్తం 50 టీమ్స్‌తో 15 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. ఈ రెండు హోటళ్లు ఏటా రూ.వందల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. HYD, దుబాయ్‌తో పాటు ఇతర నగరాల్లోనూ బ్రాంచులు ఉన్నాయి.

News November 18, 2025

POK ప్రధానిగా రజా ఫైసల్

image

పాక్ ఆక్రమిత కశ్మీర్ నూతన ప్రధానిగా PPP నేత రజా ఫైసల్ ముంతాజ్ ఎన్నికయ్యారు. ఇమ్రాన్ ఖాన్ PTI పార్టీకి చెందిన అన్వరుల్ హక్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి ఆమోదం లభించడంతో కొత్త ప్రధాని కోసం ఓటింగ్ నిర్వహించారు. 52 సభ్యులకు గాను ముంతాజ్‌కు 32 మంది అనుకూలంగా ఓటేశారు. కాగా POKకు స్వయంప్రతిపత్తిని కల్పించినట్లు చెప్పుకునే పాక్ అక్కడ నామమాత్రపు PM, ప్రెసిడెంట్ పదవులను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.