News November 12, 2024

అవినీతి జరిగితే మోదీ ఏం చేస్తున్నారు?: KTR

image

TG: కేంద్ర ప్రభుత్వ స్కీంలో అవినీతి జరిగితే ప్రధాని మోదీ ఏం చేస్తున్నారని KTR ప్రశ్నించారు. రూ.8,888కోట్ల విలువైన టెండర్లపై విచారణ జరపాలని కోరారు. అడ్రస్, అర్హత లేని కంపెనీలకు టెండర్లు ఇచ్చారని, వాటి వివరాలను ఆన్‌లైన్‌లో కూడా పెట్టలేదన్నారు. కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంలా మారిందని బీజేపీ అంటోందని, దీనిపై ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. రేవంత్, పొంగులేటిల భరతం పట్టడం ఖాయమని KTR హెచ్చరించారు.

Similar News

News January 7, 2026

BREAKING: ప్రభాస్, చిరంజీవి సినిమాల నిర్మాతలకు ఊరట

image

రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు చిత్రాల నిర్మాతలకు హైకోర్టు డివిజన్ బెంచ్‌లో ఊరట లభించింది. టికెట్ రేట్ల పెంపునకు సంబంధించి నిర్మాతల వినతులపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వొద్దని గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను పుష్ప-2, ఓజీ, గేమ్ ఛేంజర్, అఖండ-2 చిత్రాలకే పరిమితం చేసింది.

News January 7, 2026

BJP-INC: సిద్ధాంతాలు గాలికి.. కార్యకర్తలే మారాలి

image

రాజకీయ పార్టీలకు సిద్ధాంతాలు కాదు అధికారమే లక్ష్యమని అంబర్‌నాథ్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నిక నిరూపించింది. రాజకీయాల్లో ఉప్పూనిప్పుగా భ్రమ కల్పించే BJP-INC అక్కడ <<18786772>>కలిసిపోవడం<<>> ఆ పార్టీల నైతికతను ప్రశ్నిస్తోంది. అసెంబ్లీలు, పార్లమెంటులో ప్రజాప్రయోజన అంశాలపై చర్చకు ఏకతాటిపైకి రాని పార్టీలు అధికారం కోసం చేతులు కలపడం విమర్శలకు తావిస్తోంది. ఇలాంటివి చూసైనా కార్యకర్తలు మారాల్సిన అవసరం ఉంది. ఏమంటారు?

News January 7, 2026

భార్య నన్ను కొడుతోంది: నటుడు ధనుష్

image

భార్య ఆశ్రిత తనను కొడుతోందని కన్నడ నటుడు ధనుష్ రాజ్ గిరినగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేసి, బాత్రూమ్‌లో గాజు పగలగొట్టి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నట్టు కంప్లైంట్‌లో పేర్కొన్నారు. కట్నం కోసం వేధించారని, ఫిజికల్‌గా దాడి చేశారని సౌత్ డివిజన్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ధనుష్ భార్య ఆశ్రిత కూడా ఫిర్యాదు చేశారు. తనకు అబద్ధం చెప్పి వేరే మహిళతో విదేశాలకు వెళ్లాడని ఆరోపించారు.