News November 12, 2024

Inflation: సామాన్యులపై ధరల మోత

image

కూర‌గాయ‌లు, పండ్లు, నూనెలు ఇత‌ర‌త్రా నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు భారీగా పెర‌గ‌డంతో అక్టోబ‌ర్‌లో రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం 14 నెల‌ల గ‌రిష్టాన్ని తాకి 6.21%గా న‌మోదైంది. ఇది RBI నిర్దేశించుకున్న 4% ల‌క్ష్యం కంటే అధికం. అయితే, Sepలో 5.49%గా న‌మోదవ్వ‌డం గ‌మ‌నార్హం. అర్బ‌న్ ప్రాంత ద్ర‌వ్యోల్బ‌ణం 4.62% నుంచి 5.62 శాతానికి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 6.68%గా న‌మోదైంది. ధరల మోత సామాన్యులపై పెను భారం మోపుతోంది.

Similar News

News April 18, 2026

మహిళా రిజర్వేషన్: 2034 వరకు ఆగాల్సిందేనా?

image

2026 జనగణన, డీలిమిటేషన్ పూర్తయ్యాకే ‘నారీ శక్తి వందన్ అధినియం-2023’ చట్టం అమల్లోకి వస్తుందని అప్పట్లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. తాజాగా 131వ సవరణ బిల్లు వీగిపోవడంతో 2029లోగా ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. 2029 ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడం కష్టమని, 2034 వరకు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అప్పటివరకు మహిళలు వేచి చూడాల్సిందేనేమో!

News April 18, 2026

మహిళలకు విపక్షాల ద్రోహం: CM

image

AP: మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం దారుణమని సీఎం చంద్రబాబు విమర్శించారు. విపక్షాలన్నీ కలిసి మహిళల సాధికారతను అడ్డుకున్నాయని ట్వీట్ చేశారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాల వైఖరిని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. ఇది రాజకీయ అడ్డంకి మాత్రమే కాదని, కోట్లాది మంది మహిళలకు చేసిన ద్రోహం కూడా అని మండిపడ్డారు.

News April 18, 2026

ఇరాన్, లెబనాన్‌లో మేం సాధించింది ఇదే: ఇజ్రాయెల్

image

ఇరాన్, లెబనాన్‌పై దాడుల్లో తాము సాధించిన విజయాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ట్వీట్ చేసింది. ఇరాన్‌లో 28 మంది సీనియర్ లీడర్లను అంతం చేశామని, 10,800 దాడులు చేశామని తెలిపింది. 250 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను నాశనం చేశామని వెల్లడించింది. అటు లెబనాన్‌లో 1700 మందికి పైగా టెర్రరిస్టులను చంపేశామని, 5 వేలకు పైగా ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశామని వివరించింది.