News November 13, 2024
ధోనీకి ఝార్ఖండ్ హైకోర్టు నోటీసులు

భారత మాజీ క్రికెటర్ ధోనీకి ఝార్ఖండ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మాజీ వ్యాపార భాగస్వాములు మిహిర్ దివాకర్, సౌమ్య దాస్ తనను రూ.15కోట్ల మేర మోసం చేశారని JAN 5న రాంచీలో ధోనీ కంప్లైంట్ చేశారు. అయితే స్థానిక జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు తమపై ఆదేశించిన విచారణను సవాలు చేస్తూ దివాకర్, దాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే కోర్టు తన స్టాండ్ ఏంటో చెప్పాలని ధోనీకి నోటీసులు ఇచ్చింది.
Similar News
News April 17, 2026
బెస్ట్ కవర్ డ్రైవ్ కోహ్లీదే: సెహ్వాగ్

IPLలో వివిధ షాట్లను ఎవరు ఫర్ఫెక్ట్గా ఆడతారో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించారు. కవర్ డ్రైవ్- కోహ్లీ, పుల్ షాట్- వైభవ్, ఫ్లిక్ షాట్- ఆయుష్ మాత్రే, స్కూప్ షాట్, స్వీప్ షాట్- సూర్య, స్ట్రెయిట్ డ్రైవ్- సంజూ, ర్యాంప్ షాట్- డివిలియర్స్, రివర్స్ స్వీప్- ప్రభ్సిమ్రన్, కట్ షాట్- ప్రియాంశ్, ఇన్సైడ్ ఔట్- పడిక్కల్. ఈ లిస్టులో ఎవరైనా మిస్సయ్యారా? కామెంట్ చేయండి.
News April 17, 2026
మోదీని ‘జాదూగర్’ అన్న రాహుల్.. క్షమాపణకు బీజేపీ డిమాండ్

మహిళా రిజర్వేషన్లపై చర్చ సందర్భంగా PM మోదీని జాదూగర్(మెజీషియన్) అంటూ రాహుల్ గాంధీ చేసిన కామెంట్లతో లోక్సభలో గందరగోళం నెలకొంది. ఆయన ప్రధానిని అవమానిస్తున్నారంటూ BJP సభ్యులు మండిపడ్డారు. రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 140Cr ప్రజలకు ప్రతినిధి అయిన మోదీని ఎగతాళి చేయడం సరికాదని రాజ్నాథ్ విమర్శించారు. ఈ క్రమంలో LoP వ్యాఖ్యలను స్పీకర్ ఓం బిర్లా రికార్డుల నుంచి తొలగించారు.
News April 17, 2026
టెన్త్ ఫలితాలపై BIG UPDATE

AP: టెన్త్ ఫలితాలు ఈ నెలాఖరులో వెల్లడయ్యే అవకాశముంది. పేపర్ల మూల్యాంకనం పూర్తిచేసిన బోర్డు ఫలితాల విడుదలకు సిద్ధమవుతోంది. ‘సందేహాలున్న ఆన్సర్ షీట్లపై DEOలతో మాట్లాడి పరిష్కరించాం. డిఫికల్టీ ప్రశ్నలపై ఎక్స్పర్ట్స్ పరిశీలనా పూర్తయ్యింది. హిందీ తప్ప మిగిలిన ఏ సబ్జెక్టులోనూ సమస్య లేదు. మార్కుల కంప్యూటరీకరణ, వెరిఫికేషన్ కోసం 14రోజుల టైమ్ పడుతుంది. ఆపై రిజల్ట్స్ ప్రకటిస్తారు’ అని ఓ అధికారి తెలిపారు.


