News November 13, 2024

IFS సాయి చైతన్య పట్ల గర్వంగా ఉంది: మహేశ్ భగవత్

image

TG: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్-2024 పరీక్షల్లో ఆలిండియా 131వ ర్యాంకు సాధించిన సాయి చైతన్య జాదవ్‌ను రాష్ట్ర అదనపు డీజీపీ మహేశ్ భగవత్ అభినందించారు. ‘సాయి చైతన్య పట్ల గర్వంగా ఉంది. 2022లో సివిల్స్ పరీక్షలకి, ఈ ఏడాది IFS ఇంటర్వ్యూకి అతడిని గైడ్ చేశాను. నేను ఆదిలాబాద్ SPగా ఉన్న సమయంలో సాయి తండ్రి గోవిందరావు నాతో కలిసి పనిచేశారు. ఆయన కుమారుడు ఇలా IFSకి సెలక్ట్ అవడం చాలా సంతోషం’ అని పేర్కొన్నారు.

Similar News

News November 8, 2025

రాత్రి బెడ్‌షీట్ కప్పి ఫోన్ స్క్రోల్ చేస్తున్నారా?

image

ఈమధ్య యువత పగలు రాత్రి తేడా లేకుండా ఫోన్‌లో రీల్స్ ఫ్లిప్ చేస్తూనే జీవితం గడుపుతోంది. చీకట్లో కళ్లకు దగ్గరగా పెట్టుకుని ఫోన్ చూస్తే నరాలు, మెదడుపై తీవ్ర ఒత్తిడి పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పైగా లైట్స్ ఆఫ్ చేశాక, బెడ్ షీట్ కప్పుకుని స్క్రీన్‌కు అతుక్కుపోయారంటే మన కళ్లపై బ్లూ లైట్ నేరుగా పడుతుంది. దీంతో నిద్రలేమి, కంటి చూపు సమస్యలు వస్తాయి. ఫోన్ వాడండి. వ్యసనంగా మార్చుకోకండి.
Share It

News November 8, 2025

సంతోష సాగరం… ముంబై మహానగరం

image

ముంబై అనగానే మనకు గజిబిజి జీవితాలు కళ్లముందు ప్రత్యక్షమవుతుంటాయి. కానీ అందుకు భిన్నంగా ఆసియాలోనే ఇతర నగరాలకు మించి ఎన్నో ఆనందానుభూతుల్ని అందించే ప్రాంతాల్లో నం.1గా నిలిచింది. ‘Time Out’s City Life Index-2025’ సర్వేలో ఇది వెల్లడైంది. సంస్కృతి, జీవన నాణ్యత, స్థానికుల ఆదరణ, ఉపాధి వంటి అంశాలపై సర్వే చేపట్టి సంస్థ విశ్లేషించింది. ఆసియాలోని బీజింగ్, షాంఘై, చాంగ్ మాయి, హనోయ్‌లను ముంబై బీట్ చేసింది.

News November 8, 2025

ఏపీలో 10, 11 తేదీల్లో కేంద్ర బృందాల పర్యటన

image

AP: మొంథా <<18145441>>తుఫాను<<>> ప్రభావిత జిల్లాల్లో నష్టం అంచనా వేయడానికి 2 కేంద్ర బృందాలు ఈనెల 10, 11 తేదీల్లో పర్యటించనున్నాయి. హోమ్ శాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమీ బసు నేతృత్వంలో మొత్తం 8మంది అధికారులు రాష్ట్రానికి రానున్నారు. వీరు 2 టీమ్‌లుగా విడిపోయి ప్రకాశం, బాపట్ల, ఏలూరు, కృష్ణా, తూ.గో, కోనసీమ జిల్లాల్లో రెండు రోజులు పర్యటిస్తారు. క్షేత్రస్థాయిలో పంట ఇతర నష్టాలను పరిశీలిస్తారు.