News November 13, 2024

ప్రీమియం ధరకే లిస్టైన స్విగ్గీ షేర్లు.. వెంటనే నష్టాల్లోకి

image

ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. ఫుడ్ అగ్రిగేటర్ కంపెనీ స్విగ్గీ షేర్లు స్టాక్‌మార్కెట్లలో లిస్టయ్యాయి. IPO ధర రూ.390తో పోలిస్తే NSEలో 8% ప్రీమియంతో రూ.420, BSEలో 5.64% ప్రీమియంతో రూ.412 వద్ద నమోదయ్యాయి. గతవారం వచ్చిన ఈ IPOకు 3 రెట్ల స్పందన లభించింది. ఓవరాల్ మార్కెట్ కండిషన్ బాగాలేకపోవడంతో ఈ షేర్లు ప్రస్తుతం 4.38% నష్టంతో రూ.401 వద్ద ట్రేడవుతున్నాయి.

Similar News

News March 3, 2026

BJP ఆగడాలను మనం అడ్డుకోవాలి: రాహుల్

image

TG: BJP ప్రజల మధ్య విభేదాలు సృష్టించి అధికారంలోకి రావాలని చూస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండి BJP ఆగడాలను అడ్డుకొని దేశాన్ని రక్షించాలని వికారాబాద్‌లో DCC అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. ‘చేయి గుర్తు అంటే అభయ ముద్ర. అన్ని మతాల చిహ్నం కూడా అభయ ముద్రనే. అదే మన సిద్ధాంతం. కాంగ్రెస్ అంటే శాంతి, అహింస, సత్య వాక్కు. వీటితోనే మనం ప్రజల్లోకి వెళ్లాలి’ అని సూచించారు.

News March 2, 2026

ప్రధాని పదవిపై తొలిసారి రాహుల్ సానుకూల సంకేతాలు!

image

TG: ప్రధానమంత్రి పదవి చేపట్టడంపై తొలిసారి రాహుల్ గాంధీ సానుకూల సంకేతాలు ఇచ్చారు. వికారాబాద్‌లో జరిగిన DCC అధ్యక్షుల శిక్షణ శిబిరంలో ‘ఈ దేశం కోసం రాహుల్ ప్రధాని కావాల్సిందే’ అని సీఎం రేవంత్ కోరారు. అందుకు స్పందించిన రాహుల్ ‘మోదీపై యుద్ధానికి సిద్ధం’ అని తల ఊపుతూ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి పదవి అలంకరణ కాదని, ఈ దేశ ప్రజలకు సేవ చేయడం కోసమేనని రేవంత్ తెలిపారు.

News March 2, 2026

భీకర దాడి జరగబోతోంది.. ప్రజలు బయటకు రావొద్దు: ట్రంప్

image

ఇరాన్‌కు ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ‘మా సైన్యం ఇరాన్ నుంచి చెత్తను తొలగిస్తోంది. మేమింకా భారీస్థాయిలో దాడి చేయలేదు. త్వరలో భీకర దాడి జరగబోతోంది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలి. బయట సేఫ్ కాదు. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగడం నాకూ ఇష్టం లేదు. 4 వారాల్లో ముగుస్తుందని భావిస్తున్నా. ఇరాన్ ప్రజలు తమ దేశంపై నియంత్రణ సాధించాల్సిందే. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడి చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది’ అని CNNతో తెలిపారు.