News November 13, 2024
ప్రీమియం ధరకే లిస్టైన స్విగ్గీ షేర్లు.. వెంటనే నష్టాల్లోకి

ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. ఫుడ్ అగ్రిగేటర్ కంపెనీ స్విగ్గీ షేర్లు స్టాక్మార్కెట్లలో లిస్టయ్యాయి. IPO ధర రూ.390తో పోలిస్తే NSEలో 8% ప్రీమియంతో రూ.420, BSEలో 5.64% ప్రీమియంతో రూ.412 వద్ద నమోదయ్యాయి. గతవారం వచ్చిన ఈ IPOకు 3 రెట్ల స్పందన లభించింది. ఓవరాల్ మార్కెట్ కండిషన్ బాగాలేకపోవడంతో ఈ షేర్లు ప్రస్తుతం 4.38% నష్టంతో రూ.401 వద్ద ట్రేడవుతున్నాయి.
Similar News
News January 3, 2026
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సిట్?

TG: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ప్రాజెక్ట్ అంచనా వ్యయం, ఖర్చు పెట్టిన నిధులపై విచారణకు సిట్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి దీనిపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.
News January 3, 2026
ప్రముఖ నటుడికి యాక్సిడెంట్

ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. గువాహటిలో భార్య రూపాలీతో కలిసి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. స్థానికులు వెంటనే ఆశిష్ దంపతులను హాస్పిటల్కు తరలించారు. తనకు స్వల్ప గాయాలైనట్లు ఆయన SM ద్వారా వెల్లడించారు. తన భార్యను ఇంకా పరిశీలనలో ఉంచారని చెప్పారు. అభిమానులు ఆందోళన చెందవద్దన్నారు. ఆశిష్ విద్యార్థి తెలుగులో పోకిరి, చిరుత సహా అనేక సినిమాలు చేశారు.
News January 3, 2026
మంచి పశుగ్రాసానికి ఉండాల్సిన లక్షణాలు

పాడి పశువులకు అందిచే గ్రాసం రుచిగా, ఎక్కువ మాంసకృత్తులు కలిగి ఉండాలి. తక్కువ కాలంలో కోతకు వచ్చి ఎక్కువ దిగుబడి ఇచ్చేదిగా ఉండాలి. నీటి ఎద్దడిని తట్టుకొని ఏ దశలో కోసినా రుచికరంగా ఉండాలి. ఎలాంటి విష పదార్థాలు ఉండకూడదు. అన్ని కాలాల్లో మంచి దిగుబడిని ఇవ్వాలి. అన్ని రకాల నేలల్లో తక్కువ నీటితో సాగు చేసుకోగలినదై ఉండాలి. తెగుళ్లను తట్టుకునేలా, కోసిన తర్వాత రోజుల తరబడి నిల్వచేసుకొనుటకు వీలుగా ఉండాలి.


