News November 13, 2024
ఒక్కటవుతున్న పాక్ & USకు చెందిన ప్రభాస్ అభిమానులు

పాకిస్థాన్ & USకు చెందిన ప్రభాస్ అభిమానులు ఇయాజ్, లారెన్ ఒక్కటవుతున్నారు. వీరిద్దరూ ఏడాదిన్నర క్రితం సోషల్ మీడియాలో పరిచయమై ప్రేమలో పడ్డారు. త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించారు. ‘రెండు వేర్వేరు దేశాలకు చెందిన ఇద్దరు ప్రభాస్ వీరాభిమానులు కలిసి తమ జీవితాలను ఆస్వాదించబోతున్నారు. లారెన్ కోసం సప్త సముద్రాలను దాటొచ్చా’ అని ఇయాజ్ ట్వీట్ చేశారు. కాగా ప్రభాస్ ఫ్యాన్స్ వీరికి విషెస్ చెబుతున్నారు.
Similar News
News January 26, 2026
ఇలా చేస్తే.. జాతరలో తప్పిపోరు!

మేడారం మహా జాతరకు సుమారు 3 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇంతటి భారీ జనసమూహంలో పిల్లలు, వృద్ధులు తప్పిపోయే ప్రమాదం లేకపోలేదు. అందుకే ముందస్తు జాగ్రత్తగా వారి చేతిపై లేదా జేబులో ఫోన్ నంబర్, ఊరి పేరు రాసి ఉంచాలి. స్నానాలు చేసినా చెరిగిపోవద్దంటే జాతరకు వెళ్లే ముందురోజే కోన్ (గోరింటాకు)తో రాయండి. పోలీసుల QR రిస్ట్ బ్యాండ్లతో పాటు ఈ చిన్న చిట్కా మీ ఆత్మీయులను క్షేమంగా ఉంచుతుంది. SHARE IT
News January 26, 2026
ICMRలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(<
News January 26, 2026
వేరుశనగకు రికార్డు ధర.. రైతుల్లో ఆనందం

తెలుగు రాష్ట్రాల్లో వేరుశనగ రికార్డు స్థాయి ధర పలుకుతోంది. TGలోని నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్లో ఆదివారం వేరుశనగకు రూ.12,009 రికార్డు స్థాయి ధర లభించింది. వనపర్తిలో క్వింటాకు రూ.12,002.. అచ్చంపేటలో క్వింటాకు రూ.11,877 ధర లభించింది. వేరుశనగకు ప్రస్తుతం క్వింటాకు రూ.6 వేలు- రూ.10వేలకు పైగా ధర పలుకుతోంది. తమ పంటకు పెరుగుతున్న డిమాండ్ చూసి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


