News November 14, 2024

బాలలే దేశ భవిష్యత్.. గవర్నర్ అబ్దుల్ నజీర్ 

image

బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ బాలలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన విజయవాడ రాజ్‌భవన్ నుంచి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. దివంగత భారత ప్రధాని పండిట్ నెహ్రు జన్మదినమైన ఈ రోజు ఆయనను స్మరించుకోవాలన్నారు. పిల్లలే దేశ భవిష్యత్ అని, ఉత్తమ పౌరులుగా వారిని తీర్చిదిద్దాలని గవర్నర్ స్పష్టం చేశారు. 

Similar News

News December 30, 2025

EVM గోదాము వద్ద భద్రత మరింత పటిష్టంగా ఉండాలి: కలెక్టర్

image

EVM గోదాము వద్ద భద్రత మరింత పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఉన్న EVM నిల్వ కేంద్రాన్ని త్రైమాసిక తనిఖీ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తెరిచి యంత్రాల పరిస్థితిని పరిశీలించారు. అనంతరం తనిఖీ రిజిస్టర్లో కలెక్టర్‌తో పాటు పార్టీల ప్రతినిధులు సంతకాలు చేశారు. గోదాములో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండాలన్నారు.

News December 29, 2025

మచిలీపట్నంలో నేడు మీకోసం కార్యక్రమం

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డి.కె. బాలాజీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.

News December 29, 2025

మచిలీపట్నంలో నేడు మీకోసం కార్యక్రమం

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డి.కె. బాలాజీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.